నందమూరి కుటుంబాన్ని చంద్రబాబునాయుడు సమాధి చేయాలనుకొన్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.
అమరావతి: నందమూరి కుటుంబాన్ని చంద్రబాబునాయుడు సమాధి చేయాలనుకొన్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.
బుధవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందించారు.ఈ ఎన్నికల్లో టీడీపీకి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు తెలంగాణ ప్రజలు మంచి బుద్ది చెప్పారన్నారు.
చంద్రబాబునాయుడు కుట్రను జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ గుర్తించారని రోజా అభిప్రాయపడ్డారు. అందుకే వీరిద్దరూ కూడ జాగ్రత్త పడ్డారని రోజా చెప్పారు.
కూకట్పల్లిలో సుహాసిని పోటీకి దింపి నందమూరి కుటుంబాన్ని రాజకీయంగా నాశనం చేయాలని చంద్రబాబునాయుడు ప్రయత్నించారని రోజా విమర్శలు గుప్పించారు.
కూకట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది. సుహాసిని తరపున ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రాలేదు. బాలకృష్ణ, తారకరత్న మాత్రమే ప్రచారాన్ని నిర్వహించారు.
సంబంధిత వార్తలు
లగడపాటి సన్యాసం తీసుకోవాల్సిందే: రోజా వ్యాఖ్యలు
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 12, 2018, 11:13 AM IST