వైఎస్ వివేకా అంత్యక్రియలు పూర్తి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలుల మధ్య వైఎస్ వివేకానందరెడ్డి పార్థీవ దేహాన్ని ఖననం చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలుల మధ్య వైఎస్ వివేకానందరెడ్డి పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. పులింవెందుల లోని వైఎస్ రాజారెడ్డి ఘాట్లో శనివారం ఉదయం 11 గంటల ప్రాంత్రంలో వివేకానందరెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
జగన్, విజయమ్మ, కుటుంబసభ్యులందరూ.. ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అభిమాన నేతలను కడసారి వీక్షించేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతకముందు జరిగిన అంతిమ యాత్రలో కూడా జగన్, అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.