Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్ మాజీ సలహాదారు ట్వీట్ దుమారం: సాయంత్రానికి....

రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ఏపీ సీఎం వైఎస్ జగన్ మాజీ సలహాదారు పీవీ రమేష్ చేసిన ఓ ట్వీట్ రాజకీయ దుమారాన్ని రేపింది. దీంతో సాయంత్రం ఆయన అప్రమత్తమైన ఆయన మరో ట్వీట్ పెట్టారు.

YS jagan former advisor PV Ramesh tweet creates havoc
Author
Amaravathi, First Published Mar 8, 2021, 9:05 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయఎస్ జగన్ మాజీ సలహాదారు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ఓ ట్వీట్ కలకలం సృష్టించింది. ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించారనే చర్చ సాగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారని కొంత మంది భావించారు. నేరమే అధికారమై ప్రజలను నేరస్థులను చేసి వెంటాడుతుంటే... ఊరక కూర్చున్న నోరున్న ప్రతివాడూ నేరస్థుడే అని ప్రముఖ కవి వరవరరావు మాటలను ఉంటకిస్తూ ఆయన ట్వీట్ చేశారు 

ఆయన ట్వీట్ రాజకీయ దుమారాన్ని రేపింది. పదవీ విరమణ తర్వాత కూడా రమేష్ అదనపు ప్రధాన కార్యదర్శి హోదాలో సేవలంచారు. నిరుడు చివరలో ఆయన రాజీనామా చేశారు. తాను పర్యవేక్షిస్తు్న శాఖలను తొలగించడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థలో చేరారు కొంత కాలంగా మౌనం పాటిస్తూ వచ్చారు. అకస్మాత్తుగా ఆ ట్వీట్ తో ఆదివారం ఉదయం దుమారం రేపారు. 

స్వీయానుభవంతో రమేష్ అలా రాశారని చాలా మంది అన్వయించుకున్నారు. తీవ్ర దుమారం రేపడంతో పీవీ రమేష్ సాయంత్రం మరో ట్వీట్ చేశారు. తాను ట్వీట్ చేసిన వరవరరావు ఉటంకిపులు ఏ ప్రభుత్వాన్నీ, వ్యక్తులనూ ఉద్దేశించి చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు అది ఓ కవితలో భాగమని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు 

విశ్వజనీనమైన, కాలాతీతమైన సత్యాలను వ్యక్తిగతంగా ఆపాదించేందుకు ప్రయత్నిస్తే మీ ఆలోచనా శక్తి అంత వరకే పరిమితమైందిగా భావించాల్సి వస్తుందని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios