Asianet News TeluguAsianet News Telugu

రాత్రి ఇంట్లో పడుకుని తెల్లారేసరికి మాయం... కృష్ణా జిల్లాలో యువతి మిస్సింగ్

రాత్రి ఇంట్లో పడుకున్న యువతి తెల్లవారేసరికి కనిపించకుండా పోవడం కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. కాలేజీ యువతి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

Young girl Missing in Krishna  District
Author
First Published Dec 7, 2022, 10:46 AM IST

విజయవాడ : రాత్రి ఇంట్లో పడుకున్న యువతి తెల్లవారేసరికి కనిపించకుండా పోయిన ఘటన కృష్ణా జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వయసులో వున్న అమ్మాయి కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడుతున్నారు. యువతి మిస్సింగ్ కు కారణం ప్రేమ వ్యవహారమా లేక మరేదయినా దారుణం జరిగివుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. 

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన పామర్తి లావణ్య(20) విజయవాడ స్టెల్లా కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రోజూ మాదిరిగానే గత సోమవారం(డిసెంబర్ 5న) కూడా కాలేజీకి వెళ్లివచ్చింది. రాత్రి భోజనం చేసి పడుకున్న ఆమె తెల్లవారేసరికి కనిపించకుండా పోయింది. దీంతో కంగారుపడిపోయిన కుటుంబసభ్యులు నిన్నంతా (మంగళవారం) వెతికినా... ఇంటి చుట్టుపక్కల వారిని, బంధువులను ఆరాతీసినా ఆఛూకీ లభించలేదు. దీంతో లావణ్య తల్లి కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

యువతి మిస్సింగ్ కేసును సిరియస్ గా తీసుకున్న కంకిపాడు పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఇతర పోలీస్ స్టేషన్లకు కూడా యువతి ఫోటో, వివరాలను పంపించి ఆఛూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

Read More  చిన్నారులను కొని.. పెంచిన తరువాత వ్యభిచార రొంపిలోకి దింపి.. యాదగిరిగుట్టలో దారుణం...

ఇదిలావుంటే ఓ చర్చి ఫాస్టర్ కూతురి వయసున్న బాలికను లోబర్చుకుని ఆమెను లేపుకెళ్లిన ఘటన కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది. అనారోగ్యంతో దైవ సన్నిధికి వచ్చిన మైనర్ ను ప్రేమ పేరుతో నమ్మించి లోబర్చుకున్నాడు. చివరకు అతడి పాపం పండి జైలుపాలయ్యాడు. 

 నూజివీడులోని ఓ చర్చిలో నాగేశ్వరరావు(450 పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడిన ఫాస్టర్ భార్య ఇటీవలే చనిపోయింది. దీంతో పాస్టర్ ఇద్దరు పిల్లలతో కలిసి వుంటున్నాడు. ఇలా భార్య లేకుండా జీవిస్తున్న అతడు చర్చికి వచ్చే ఓ మైనర్ బాలికపై కన్నేసాడు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు స్వస్థత చేకూరుస్తానని నమ్మించి లోబర్చుకుని శారీరకంగా వాడుకున్నాడు. 

అయితే ఈ వ్యవహారం కొన్నాళ్ళకు తల్లిదండ్రులకు తెలియడంతో బాలికను గన్నవరం మండలం ముస్తాబాద్ లోని పిన్ని ఇంటికి పంపారు. ఈ విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు అక్కడికి వెళ్లి బాలికను లేపుకుని హైదరాబాద్ కు తీసుకెళ్లాడు. బాలిక బందువులు ఎలాగోలా హైదరాబాద్ లో వీరి ఆఛూకీ తెలుసుకుని ఫాస్టర్ ను గన్నవరం పోలీసులకు అప్పగించారు. మైనర్ బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో పంపించారు పోలీసులు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios