Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ ని సీఎం చేయడానికి...అమ్మవారి ఆలయంలోనే భువనేశ్వరి క్షుద్రపూజలు: లక్ష్మీపార్వతి

టీటీడీ కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందని కావాలనే వైసిపి ప్రభుత్వంపైప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయని తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి ఆరోపించారు. .

 

YCP Leader lakshmi parvathi sensational comments on nara bhuvaneshwari
Author
Amaravathi, First Published Sep 23, 2020, 6:46 PM IST

అమరావతి: తిరుమల డిక్లరేషన్ విషయంలో  విపక్షాలు ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలుగు అకాడమీ చైర్మన్, వైసీపీ  నేత లక్ష్మీ పార్వతి. ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు అంత పని పాట లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని..డిక్లరేషన్ పేరుతో  అనవసరంగా ప్రభుత్వంపై, సీఎంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. 

''కరోనా నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు విపక్షాలకు పట్టడం లేదు. మతం పేరుతో  ప్రజలని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. చెన్నారెడ్డిని దింపేదుకు  మత పరమైన అల్లర్లు సృష్టించే వారు కాంగ్రెస్ నేతలు. 1989-1994మధ్యలో ఇలాగే పాత బస్తీలో అల్లర్లు చేశారు. కాంగ్రెస్ కల్చర్ లో ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారో అలాగే ఇప్పడు మతం పేరుతో రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ నుండి వచ్చారు కాబట్టి ఆ కల్చర్ ఇంకా పోలేదు'' అని విమర్శించారు.

''ఇప్పడు టీటీడీ విషయంలో బీజేపీ, టీడీపీ నేతలు అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా టీడీపీ నేతలు మాట్లాడినట్లే మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మత పరంగా రాజకీయం చెయ్యడానికి సీఎం మతాన్ని నమ్ముకున్న వ్యక్తి కాదు. హిందూ సంప్రదాయం చంద్రబాబు ఎప్పుడు పాటించారో చెప్పాలి. హిందూ మతం పట్ల చంద్రబాబు నమ్మకం ఉంటే ప్రజలకు నిరూపించాలి'' అన్నారు. 

''టీటీడీ కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందని ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు.  అసలు ముఖ్యమంత్రికి డిక్లరేషన్ వర్తిస్తుందా? సోనియా గాంధీ తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ అడిగారా? చంద్రబాబు ఎప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడు. వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డి మతం పాటించాలని ఎప్పుడు చెప్పారు. కాషాయం వేసిన మూర్ఖులు అంతా ఒక చోట చేరారు. హిందూ అనేది ఒక మతం కాదు, హిందూ అనేది ఒక ధర్మం. మతం పేరు చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

read more  తిరుమల చేరుకున్న సీఎం జగన్.. అప్రమత్తమైన పోలీసులు

''లోకేష్ ని ముఖ్యమంత్రిని చెయ్యడం కోసం  భువనేశ్వరి క్షుద్ర పూజలు చేశారు. అమ్మవారి దేవాలయంలో అర్ధ రాత్రి క్షుద్ర పూజలు చేయించిన దుర్మార్గురాలు చంద్రబాబు భార్య'' అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 

''బీజేపీకి అస్సలు చిత్తశుద్ధి ఉంటే గతం సంవత్సరంలో కూడా జగన్  పట్టు వస్త్రాలు సమర్పించారు అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తారు.  భువనేశ్వరి, లోకేష్ కోసం చేసిన క్షుద్ర పూజల గురించి బీజేపీ నేతలు అడగాలి. ముఖ్యమంత్రికి రాష్ట్రంపై సర్వ హక్కులు ఉంటాయి.  రాజు విష్ణువుతో సమానమని పురాణాలు చెప్తున్నాయి. రాజుకు మతాలు అంటగట్టడం దారుణం'' అన్నారు. 

''బీజేపీ, టీడీపీ నేతలు డిక్లరేషన్ గురించి వాస్తవాలు మాట్లాడాలి. జగన్ ఎప్పుడో హిందువుగా మారారు. గతంలో  స్వరూపానందే జగన్ మోహన్ రెడ్డిని తీసుకొని  గంగా నదిలో పూజలు చేయించారు. గంగా నదిలో మూడు మునకలు మునిగి  హిందువుగా మారారు. అలా అని క్రిస్టియానీటిని పక్కన పెట్టినట్లు కాదు. కొందరు స్వామీజీలు కాషాయం ధరించి రాజకీయాలు చేస్తున్నారు. ముస్లింగా ఉన్న  కరీం  దాసు, బిబి నాంచారి ఎవరో స్వామిజీలకు తెలీదా?'' అని ప్రశ్నించారు. 

''మతం పేరుతో ప్రజలలో  హింసను రెచ్చోగొట్టి  మధ్య యుగంలోకి నెడతారా? కుహనా హిందువులను హెచ్చరిస్తున్నా... అవస్తావాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. సమాజానికి కావాల్సింది విద్యా, వైద్యం కానీ మతం, కులం కాదు.  ఇప్పటికైనా రాజకీయ పక్షాలు అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేయాలి. డిక్లరేషన్ పై బహిరంగ చర్చకు ఎవరితో అయిన నేను సిద్ధం. హిందూ సంప్రదాయం, పురాణలపై నాకు పూర్తి అవగాహన ఉంది.  నేను ఖురాన్, బైబిల్ ,భగవద్గీతను చదివాను. సర్వమతాలను నేను ఆరాధిస్తాను'' అని లక్ష్మీ పార్వతి అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios