చంద్రబాబు తినే చపాతీకి అంతపెద్ద ప్యాంట్రీ వ్యాన్...?
- ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నారని ఆరోపించారు.
- బస్సులో, ఇన్నోవా కార్లలో డబ్బు తరలింపు
- ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు
ఒక్క చపాతీ తినే చంద్రబాబుకు అంత పెద్ద ప్యాంట్రీ ఎందుకు అని ధ్వజమెత్తారు వైసీపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఉప ఎన్నిక ప్రచారం కోసం ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నారని ఆరోపించారు. శనివారం మీడియా తో మాట్లాడిన శ్రీధర్ రెడ్డి నోట్ల కట్టలతో నంద్యాల రోడ్లపై టీడీపీ నేతలు తిరుగుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే. అధికార పార్టీ నంద్యాల్లో అవినీతి సొమ్మును వరదలా పారిస్తుందని ఆయన పెర్కొన్నారు. శుక్రవారం రాత్రి ప్యాంట్రీ వ్యాన్ ను ఓపెన్ చేసిన అధికారులు బస్సును, ఇన్నోవా కార్లను మాత్రం ఎందుకు తెరవలేదని ప్రశ్నించారు. ప్యాంట్రీ వ్యాన్ ముసుగుతో అడ్డదారుల్లో వందల కోట్ల రూపాయలు తరలించారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రజా స్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
తమ పార్టీ నేతలను ప్రలోబాలతో చంద్రబాబు లొంగదీసుకున్నారని ఆరోపించారు. టీడీపీ నుండి ఒక్క ఎమ్మెల్సీ వస్తే రాజీనామా చేయించి మరీ అహ్వానించిన ఘనత జగన్దని ఆయన పెర్కొన్నారు. జగన్ కి, చంద్రబాబకు మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. చంద్రబాబు అనైతిక రాజకీయాలకు పాలుపడుతున్నారని విమర్శించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.