Asianet News TeluguAsianet News Telugu

విశాఖపట్నం: రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి

Visakhapatnam: భీమునిపట్నం సమీపంలోని వలందపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ ను ఢీకొట్టి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
 

Visakhapatnam : Two persons died in a road accident RMA
Author
First Published Mar 23, 2023, 5:14 PM IST

Bheemunipatnam road accident:  విశాఖపట్నంలోని భీమునిపట్నం సమీపంలోని వలందపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున కారు డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ ను ఢీకొట్టి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 

దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను శ్రీకాకుళంకు చెందిన ఎల్.దుర్గాప్రసాద్, పి.సంతోష్ గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకుని విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని స్థానిక‌ పోలీసులు తెలిపారు.

నలందలో..

ఇదిలావుండ‌గా, బీహార్ లోని నలందలో గురువారం బైక్ ను టాక్ట‌ర్ ఢీ కొన్న‌రోడ్డు ప్రమాదంలో మేనమామ, మేనకోడలు మృతి చెందారు. బీహార్ షరీఫ్-బార్బిగా ప్రధాన రహదారిపై అస్తావాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్పూర్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులను సర్బహాది గ్రామానికి చెందిన ఉమేష్ మలకర్ కుమారుడు భూషణ్ మలకర్ (17), ఖండక్పర్ నివాసి వీరేంద్ర మలకర్ కుమార్తె మహి కుమారి (6)గా గుర్తించారు. ఈ ఘటనలో మహి కుమారి సోదరుడు మనీష్ కుమార్ కు స్వల్ప గాయాలయ్యాయి.

మ‌హారాష్ట్రలో..

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో కారును ట్రక్కు ఢీకొనడంతో అమన్, అతని భార్య మృతి చెందారు. బుధవారం మధ్యాహ్నం వరోరా-వనీ రోడ్డులోని షెబల్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగిందని, మృతులను డాక్టర్ అతుల్ గౌర్కర్, డాక్టర్ అశ్విని గౌర్కర్ గా గుర్తించామని తెలిపారు. బంధువుల సమాచారం మేరకు వనీలోని జిల్లా ఆసుపత్రిలో చేరిన అశ్విని అక్కడికక్కడే మృతి చెందగా, అతుల్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios