Asianet News TeluguAsianet News Telugu

మూడు రాజధానులకు అడ్డంకులు సృష్టించడం ఆపండి: మంత్రి గుడివాడ అమర్‌నాథ్

Visakhapatnam: మూడు రాజధానులకు అడ్డంకులు సృష్టించడం ఆపాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమానంగా పరిగణిస్తున్న‌ద‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు.
 

Visakhapatnam : Stop creating barriers to the three capitals: Mantri Gudivada Amarnath
Author
First Published Nov 29, 2022, 3:58 AM IST

AP IT Minister Gudivada Amarnath Reddy: స్వార్థానికి, అభివృద్ధికి మధ్య జరిగిన పోరులో అభివృద్ధే విజయం సాధించిందని  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. అమరావతిలో ఆరు నెలల్లో ప్రాజెక్టులు పూర్తి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని ఐటీ శాఖ మంత్రి అన్నారు. సోమవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతున్నగుడివాడ అమర్‌నాథ్ పై వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ప్రతిపాదనకు అడ్డంకులు సృష్టించడం మానుకోవాలని సూచించారు. రాజకీయ మైలేజీ కోసమే వివిధ ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టి అధికార వికేంద్రీకరణకు అడ్డంకులు సృష్టించవద్దని ప్రతిపక్ష పార్టీల నేతలను కోరారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమానంగా పరిగణిస్తున్నదని ఐటీ శాఖ మంత్రి అన్నారు. ఉత్తరాంధ్రతో పాటు ఇతర ప్రాంతాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయాలని అధికార పార్టీ కృతనిశ్చయంతో ఉందన్నారు. అమరావతి అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యతిరేకం కాదని అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. అయితే, అమరావతితో పాటు చాలా కాలంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధిపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు. తమ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందాలనీ, ఇతర ప్రాంతాలను కాదని భావించే నయీం లాంటి వారికి సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ తగిన గుణపాఠం చెప్పిందని ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.

కాగా, గ‌త కొంత కాలంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌ధాని కోసం రాజ‌కీయ పార్టీల మ‌ద్య పొలిటిక‌ల్ వార్ న‌డుస్తోంది. ప్ర‌తిప‌క్షాలు అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం పోరాటం చేస్తుండ‌గా, అధికార పార్టీ వైస్సార్సీపీ మూడు రాజ‌ధానుల ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలోనే రాజ‌ధాని అంశం కోర్టుల‌కు చేరింది. అయితే, ఇదివ‌ర‌కు అమరావతిపై ఏపీ  హైకోర్టు  ఇచ్చిన  తీర్పుపై  సుప్రీంకోర్టు  సోమ‌వారం  స్టే  ఇచ్చింది.  సుప్రీంకోర్టు తీరుపై మంత్రి గుడివాడ అమ‌ర్ నాథ్ స్పందిస్తూ పై వ్యాక్య‌లు చేశారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో పాటు ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము అన్ని ప్రాంతాల అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌నీ, అందుకే మూడు రాజ‌ధానుల విష‌యంలో కృత నిశ్చ‌యంతో ముందుకు సాగుతున్నామ‌ని తెలిపారు. 

సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి జోగి  రమేష్ సైతం  స్పందించారు. తాము  చెబుతున్నది అభివృద్ధి  వికేంద్రీకరణ అన్నారు.అభివృద్ధి  వికేంద్రీకరణ చేయకపోతే భవిష్యత్తు  తరాలు  ఇబ్బందులు పడతాయన్నారు.అమరావతిలోనే లక్షల కోట్లు  ఖర్చు పెడితే రాయలసీమ,ఉత్తరాంధ్రలో  ఉద్యమాలు  వచ్చే అవకాశం  ఉందని చెప్పారు. చట్టప్రకారమే అభివృద్ది వికేంద్రీకరణ ప్రక్రియ అని మంత్రి తెలిపారు. ఐదుకోట్ల ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉంటుందన్నారు.ప్రజల అభీష్టానికి  అనుగుణంగానే  మూడు  రాజధానుల నిర్ణయం తీసుకున్నామని మంత్రి  జోగి రమేష్  చెప్పారు. అలాగే, మంత్రి అంబ‌టి రాంబాబు సైతం అమరావతిపై ఏపీ హైకోర్టు  ఇచ్చిన  తీర్పుపై  సుప్రీంకోర్టు  స్టే  ఇవ్వడాన్ని స్వాగతించారు. అమరావతిని  చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారన్నారు. కానీ అమరావతిలో  ఎలాంటి  నిర్మాణాలు  చేయలేదన్నారు. సుప్రీం వ్యాఖ్యలు  వికేంద్రీకరణకు  బలాన్ని ఇస్తున్నాయని  ఆయన  చెప్పారు. అన్ని ప్రాంతాలకు  న్యాయం  చేయాలనే  ఉద్దేశ్యంతో  తమ  ప్రభుత్వం  మూడు రాజధానులను  తెరమీదికి  తెచ్చిందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios