Asianet News TeluguAsianet News Telugu

డ్రమ్ములో మృతదేహం : వెలుగులోకి షాకింగ్ విషయాలు.. చంపి, ఆ తరువాత ముక్కలు చేసి.. ప్లాస్టిక్ కవర్లో చుట్టి...

విశాఖలో కలకలం రేపిన ఓ ఇంట్లోని డ్రమ్ములో మహిళ మృతదేహం కేసులో అత్యంత దారుణమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆ మహిళను చంపి, ముక్కలు చేసి.. ప్లాస్టిక్ కవర్లో చుట్టి..డ్రమ్ములో కుక్కారు.

updates in woman dead body found in water drum, visakhapatnam
Author
First Published Dec 6, 2022, 7:36 AM IST

విశాఖపట్నం : వైజాగ్ లో ఓ కాలనీలో డ్రమ్ములో కుళ్లిన స్థితిలో దొరికిన మహిళ మృతదేహం సోమవారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో విశాఖపట్నంలోని మధురవాడ వికలాంగుల కాలనీలో  చోటుచేసుకున్న ఈ దారుణానికి సంబంధించిన  షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ మహిళను హత్య చేసిన తర్వాత శరీరాన్ని ముక్కలుగా కోశారు. కుళ్లినా ఏమాత్రం వాసన రాకుండా ఆ శరీర భాగాలను ప్యాక్ చేశారు. ఈ మేరకు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఢిల్లీలోని శ్రద్ధ వాకర్ హత్య కేసు కంటే దారుణంగా ఈ కేసులో నిందితులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.  ఇది తీవ్ర భయాందోళనలకు దారితీస్తుంది. 

ఓ ఖాళీ ఇంట్లో మహిళ మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి.. ఓ పెద్ద డ్రమ్ములో  దాచిపెట్టిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చి.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి  విధితమే. ఇంటి నుంచి వాసన రావడంతో చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేయడంతో.. ఇంటి యజమాని వచ్చి పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా.. శరీర భాగాలు పెట్టిన ప్లాస్టిక్ సంచులను పూడ్చి పెట్టాలని నిందితులు ప్లాన్ వేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

విశాఖపట్నంలో దారుణం.. నీళ్ల డ్రమ్ములో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం.. చంపి, ముక్కలు చేసి..

ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా అంతకు ముందు అదే ఇంట్లో అద్దెకు ఉన్న రుషి(40)ని అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు రుషిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతురాలిది శ్రీకాకుళం జిల్లాగా  అనుమానిస్తున్నారు. అనుమానితుడు రుషి స్వస్థలం పార్వతి పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట. ఘటనకు సంబంధించి దర్యాప్తులో భాగంగా.. హత్య జరిగిన ఇంట్లోనే వేలిముద్రలను సోమవారం పోలీసులు, క్లూస్ టీం సేకరించారు. ఘటన వెలుగులోకి రాగానే దీనిని ఛేదించే క్రమంలో భాగంగా పోలీసులు విశాఖ పట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఐదు బృందాలుగా వెళ్లారు. నిందితుడికి సంబంధించిన వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన మహిళకు..రుషికి మధ్య ఆర్థిక సంబంధమైన లావాదేవీల విషయంలో గొడవలు జరిగి ఉండొచ్చని.. ఆ కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ కేసు సోమవారం విశాఖపట్నంలో దారుణ ఘటన వెలుగు చూసింది. మధురవాడ పరిధిలోని కొమ్మాది వికలాంగుల కాలనీలోని ఓ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోని నీళ్ల డ్రమ్ములో మహిళ మృతదేహం దొరికింది. అది పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పీఎంపాలెం పోలీసులు దీనిమీద తెలిపిన వివరాల ప్రకారం.. నండూరి రమేష్ అనే వ్యక్తికి  వికలాంగుల కాలనీలో ఒక ఇల్లు ఉంది. అతను ఎండాడలో వెల్డింగ్ దుకాణం నడుపుతున్నాడు. రమేష్ దగ్గర దుకాణంలో రుషి అనే యువకుడు రెండేళ్ల క్రితం పనిలో చేరాడు. ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చే రెండు నెలల క్రితమే అతను ఇళ్లు ఖాళీ చేసి, పని మానేసి వెళ్లిపోయాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios