కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకు గాయమైంది. కారు డోర్ తగలడంతో ఈ గాయమైంది. దుర్గగుడికి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.
విజయవాడ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకు గురువారం నాడు గాయమైంది. ఆశీర్వాద సభ ముగించుకొని దుర్గగుడికి వెళ్లే సమయంలో కారు డోర్ ఆయన తలకు తగిలింద. దీంతో ఆయన తలకు గాయమైంది.
Add Asianetnews Telugu as a Preferred Source

Scroll to load tweet…
జన ఆశీర్వాద సభలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చారు. ఇవాళ ఉదయం ఆయన తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. అక్కడి నుండి నేరుగా ఆయన విజయవాడకు వచ్చారు.
విజయవాడలో ఆయన బీజేపీ నిర్వహించిన ఆశీర్వాదసభలో పాల్గొన్నారు. ఈ సభ ముగిసిన తర్వాత కిషన్ రెడ్డి విజయవాడలో ఇంద్రకీలాద్రి ఆలయంలో దుర్గమ్మను దర్శించుకొనేందుకు వెళ్లేందుకు ఆయన కారు ఎక్కుతున్న క్రమంలో ఆయనకు గాయాలయ్యాయి.మంత్రి కారులో కూర్చొనే సమయంలో కారు డోర్ ఆయన తలకు బలంగా తగిలింది.
