Asianet News TeluguAsianet News Telugu

17 రాష్ట్రాలకు కేంద్రం ఊరట, రెవెన్యూ లోటు నిధుల విడుదల.. ఏపీకి ఎంతంటే..!

రెవెన్యూ లోటుతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెవెన్యూ లోటు భర్తీకి సంబంధించి 17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసింది. దీనిలో భాగంగా సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,438 కోట్లు విడుదల చేసింది. 

union finance ministry released post devolution revenue deficit grant to 17states
Author
Amaravati, First Published Sep 9, 2021, 4:59 PM IST

రెవెన్యూ లోటుతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెవెన్యూ లోటు భర్తీకి సంబంధించి 17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసింది. దీనిలో భాగంగా సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,438 కోట్లు విడుదల చేసింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానిని ఏపీకి మొత్తంగా రూ.8,628.50 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి మొత్తం ఇప్పటి వరకు రూ.59,226 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.   

Follow Us:
Download App:
  • android
  • ios