పాడెపై నుంచి లేచి కూర్చున్న వ్యక్తి: చివరకు జరిగింది ఇదీ...
చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలంలో అంత్యక్రియలు చేయడానికి తీసుకుని వెళ్తుండగా లేచి కూర్చున్న వ్యక్తి ఉదంతం తెలిసిందే. అతని కథ చివరకు ముగిసింది.
చిత్తూరు: పాడెపై నుంచి లేచి కూర్చున్న వ్యక్తి ఉదంతం విషాదకరంగా ముగిసింది. అంత్యక్రియలకు తీసుకుని వెళ్తుండగా ఓ వ్యక్తి పాడెపై లేచి కూర్చున్న విషయం తెలిసిందే. అయితే 24 గంటలు కూడా గడవక ముందే అతను తుదిశ్వాస విడిచాడు.
చిత్తూరు దజిల్లా మదనపల్లె రూరల్ మండలో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. దాంతో అతను మరణించాడని భావించి గ్రామస్థులు అంత్యక్రియలకు తీసుకుని వెళ్తుండగా స్పృహలోకి వచ్చాడు. సోమవారంనాడు ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read: అంత్యక్రియలకు తీసుకెళుతుండగా.. పాడెపై నుంచి లేచి కూర్చున్న వ్యక్తి.. !
దాంతో అతన్ని రెవెన్యూ, పంచాయతీ అధికారులు మదనపల్లె ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మంగళవారంనాడు మరణించాడు.
అయితే, అతను ఎవరనే విషయం తేలలేదు. అతని వివరాలు తెలియడ లేదు. అతను ఎవరనే విషయాన్ని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నాలు సాగించారు.