Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి : చింతా మోహన్ కు ఆస్తుల్లేవు..గురుమూర్తికి కారు లేదు..

తొమ్మిది సార్లు తిరుపతి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఆరు సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. వైకాపా అభ్యర్థి గురుమూర్తి పేరిట కారు లేదు. బీజేపీ అభ్యర్థిని రత్నప్రభ కు దాదాపు రూ. 19.50 కోట్ల ఆస్తి పాస్తులున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సోమవారం నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం వారి ఆస్తుల వివరాలు ఇవి...

Tirupati bypoll nominations : candidates properties list - bsb
Author
Hyderabad, First Published Mar 30, 2021, 9:31 AM IST

తొమ్మిది సార్లు తిరుపతి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఆరు సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. వైకాపా అభ్యర్థి గురుమూర్తి పేరిట కారు లేదు. బీజేపీ అభ్యర్థిని రత్నప్రభ కు దాదాపు రూ. 19.50 కోట్ల ఆస్తి పాస్తులున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సోమవారం నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం వారి ఆస్తుల వివరాలు ఇవి...

గురుమూర్తి కుటుంబ ఆస్తులు రూ. 47.25 లక్షలు 

- వైకాపా అభ్యర్థి ఎం. గురుమూర్తి కుటుంబ ఆస్తుల మొత్తం రూ. 47.25 లక్షలు. 
- ఆయన పేరిట రూ.10 ,66,515 లక్షల విలువైన చరాస్తులున్నాయి. 
- భార్య నవ్యకిరణ్ పేరు మీదరూ.  24,92,529 విలువైన చరాస్తులున్నాయి. ఇందులో గురుమూర్తి భార్య పేరిట ఏడు లక్షల విలువైన కారు ఉంది.
-  ఏర్పేడు మండలంలో మన్న సముద్రం గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి (డికెటి), 2,610 చదరపు అడుగుల్లో ఇల్లు ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ ఐదు లక్షలు.
- వీరికి అప్పులు లేవు. క్రిమినల్ కేసులు లేవు.
- గురుమూర్తి పై ఆధారపడిన కార్తికేయ నిక్షాల్ దగ్గర రూ. 2.92 లక్షల విలువైన 62 గ్రాముల బంగారం, నిక్షాల్ భార్య దగ్గర రూ.  3.73 లక్షల విలువైన 83 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు.

రత్నప్రభ కుటుంబ ఆస్తులు రూ. 24.68 కోట్లు 

- భాజపా అభ్యర్థి విశ్రాంత ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ కుటుంబ ఆస్తుల విలువ మొత్తం రూ. 24, 68,52,141. ఇందులో రత్నప్రభ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ. 19,57,75,095. రత్నప్రభ భర్త ఏ విద్యాసాగర్ పేరున ఉన్న ఆస్తులు రూ.  5,10, 77,146. - రత్నప్రభ చేతిలోని నగదు రూ. 25000 
- వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదు డిపాజిట్లు రూ. 2.81 కోట్లు, బాండ్ల రూపంలో రూ.28,000, తపాలా పొదుపు ఖాతాల్లో రూ. 4 లక్షలు. 
- రూ. 52 లక్షల విలువైన 1,250గ్రాముల బంగారం, రూ. 1.95 లక్షల విలువైన మూడు కేజీల వెండి, రూ. 16 లక్షల విలువైన రెండు ఎకరాల వ్యవసాయ భూమి, మూడు కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి
- ఎస్.బి.ఐ లో ఆమె పేరిట రూ. 2.43 లక్షల రుణం ఉంది.
-ఎ. విద్యాసాగర్ పేరిట కోటి విలువైన చరాస్తులు, రూ. 4.10 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఆంధ్ర బ్యాంకులో రూ.  17.30 లక్షల వ్యవసాయ రుణం తీసుకున్నారు. వీరిపై ఇలాంటి కేసులు లేవు.

చింతా మోహన్ కుటుంబ ఆస్తులు రూ. 3.27 కోట్లు 

- కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ పేరున ఆస్తులు ఏమీ లేవు. ఆయన వార్షికాదాయము రూ. 6.10 లక్షలని అఫిడవిట్ లో ప్రస్తావించారు.
- ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ 3.27 కోట్లు, ఇవన్నీ భార్య చింత రేవతి పేరున ఉన్నాయి.
- వీటిలో రెండు లక్షల నగదు, రూ.14 40,000 విలువైన 400 గ్రాముల బంగారం ఉంది. - తిరుపతిలో 20 సెంట్ల వ్యవసాయేతర భూమి ఉంది, దీని విలువ రూ.1.20 కోట్లుగా పేర్కొన్నారు.
- తిరుపతి రామచంద్ర నగర్ లో రూ. 95 లక్షల విలువైన వాణిజ్య భవనం ఉంది. - ఎస్బిఐ లో రూ. 19 11 లక్షల అప్పు ఉంది. వీరిపై ఎలాంటి కేసులు లేవు.

Follow Us:
Download App:
  • android
  • ios