దారుణం: ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య
అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బుధవారం నాడు దారుణం చోటు చేసుకొంది. ఒకే కుటుంబంలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలను హత్యకు గురయ్యారు.
అనంతపురం:అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బుధవారం నాడు దారుణం చోటు చేసుకొంది. ఒకే కుటుంబంలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలను హత్యకు గురయ్యారు.ఇంట్లోనే ముగ్గురు హత్యకు గురయ్యారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.
సంఘటనాస్థలాన్ని పోలీసులు సందర్శించి ఈ ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. అసలు ఒకే కుటుంబంలో ముగ్గురిని ఎవరు హత్య చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.