కుటుంబ కలహలతో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను బాలకొండయ్య, శోభన, భావనలుగా గుర్తించారు.


కడప: కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురంలో ఒకే కుటంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహలతోనే ఈ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

శ్రీనివాసపురం గ్రామానికి చెందిన బాలకొండయ్యతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లు భావన, శోభనలు వ్యవసాయబావిలో శవాలుగా తేలారు. గురవారం నాడు సాయంత్రం నుండి ఈ ముగ్గురు కన్పించకుండాపోయారు. స్థానికులు వారి కోసం వెదికారు. కానీ ఆచూకీ లభ్యం కాలేదు.

ఇవాళ ఉదయం పొలానికి వెళ్తున్న స్థానికులు వ్యవసాయబావిలో మూడు మృతదేహలను గుర్తించారు. మృతదేహలను బాలకొండయ్యతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లు భావన, శోభనవిగా గుర్తించారు.

Also read:ఏకాంత ఫోటోలు, వీడియోలతో వేధింపులు: మాజీ భర్తపై ఫిర్యాదు

గత ఏడాది క్రితమే బాలకొండయ్య భార్య బుజ్జమ్మ ఆత్మహత్య చేసుకొంది. గురువారం నాడు ఈ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ముగ్గురి ఆత్మహత్యకు కుటుంబ కలహలే కారణంగా గ్రామస్తులు చెబుతున్నారు.

ఏడాది వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడడం గ్రామంలో విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.