ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలో (Visakhapatnam) కొత్త సంవత్సరం తొలి రోజే ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. విశాఖ ఆరిలోవ బీఆర్‌టీఎస్ రోడ్‌లో (BRTS Road) పెద్దగదిలి దగ్గర శనివారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలో (Visakhapatnam) కొత్త సంవత్సరం తొలి రోజే ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. విశాఖ ఆరిలోవ బీఆర్‌టీఎస్ రోడ్‌లో (BRTS Road) పెద్దగదిలి దగ్గర శనివారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైక్‌లు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరోకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో పర్యాటక కేంద్రమైన విశాఖలో న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations) సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు ఆ రహదారిని మూసివేశారు. అయితే ఉదయం ఆ రహదారిపై వాహనాలను అనుమతించిన కాసేటికే ఈ ప్రమాదం జరిగింది.