Asianet News TeluguAsianet News Telugu

మూడు రోజుల పసికందు కిడ్నాప్.. గుంటూరు హాస్పిటల్‌లో ఘటన

గుంటూరు జిల్లాలో మూడు రోజుల పసికందును కొందరు దుండగులు అపహరించారు. ఈ నెల 12న జన్మించిన మగ శిశువును వార్డు బయటకు తీసుకువచ్చి నిద్రబుచ్చి అమ్మమ్మ, నానమ్మలూ పడుకున్నారు. అప్పుడే ఆ బాలుడిని కిడ్నాప్ చేశారు. పోలీసులకు రంగంలోకి దిగారు. ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
 

three day baby boy kidnapped in guntur
Author
Amaravati, First Published Oct 16, 2021, 12:45 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. Guntur జిల్లాలోని ప్రభుత్వ hospital నుంచి మూడు రోజుల పసికందును దుండగులు kidnap చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది.

గుంటూరు సమీపంలోని పెదకాకానికి చెందిన ప్రియాంక ఈ నెల 12న జీజీహెచ్ ఆస్పత్రిలో ప్రసవించారు. ప్రియాంకకు బాలుడు జన్మించాడు. ఆ శిశువును తాత, అమ్మమ్మలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 15వ తేదీ అర్ధరాత్రి దాటాక సుమారు 1.30 గంటల ప్రాంతంలో బాబును వార్డు బయటకు తీసుకువచ్చారు. అక్కడే కాసేపు ఆడించారు. అనంతరం బాబును పక్కనే ఉంచుకుని నిద్రపోయారు.

Also Read: గుంటూరు వాసులకు శుభవార్త: రూ.130 కోట్లతో పీవీకే నాయుడు కాంప్లెక్స్.. మంత్రి బొత్స ఆమోదం

ఇదే అదనుగా కొందరు దుండగులు తమ పథకం అమలు చేశారు. ఆ వృద్ధుల పక్కనే పడుకున్న శిశువును గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. కాసేపటికి మెలకువకు వచ్చిన ఆ ముసలివాళ్లు పక్కన బాబు లేకపోవడంతో హతాశయులయ్యారు. వెంటనే జీజీహెచ్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అనంతరం ఓ ఇద్దరు అనుమానితులను గుర్తించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. శిశువు అదృశ్యంతో పెదకాకానికి చెందిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios