విజయవాడ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.  సత్యనారాయణ పురంలో పట్టపగలే ఓ ఇంట్లోకి చొరబడిన దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ గొంతుకోసి దోపిడీకి ప్రయత్నించారు. అయితే ఆమె అరుపులను విని స్థానికులు చేరుకోవడంతో దుండగులు అక్కడి నుండి పరారయ్యారు.

విజయవాడ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సత్యనారాయణ పురంలో పట్టపగలే ఓ ఇంట్లోకి చొరబడిన దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ గొంతుకోసి దోపిడీకి ప్రయత్నించారు. అయితే ఆమె అరుపులను విని స్థానికులు చేరుకోవడంతో దుండగులు అక్కడి నుండి పరారయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ ఘటనతో ఒక్కసారిగా విజయవాడలో కలకలం రేగింది. ఆచార్యవీధి లో ఓ ఇంట్లో ఒంటరి మహిళను గమనించిన దుండగులు మద్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడ్డారు.అయితే వీరిని ఇంట్లో ఉన్న పద్మావతి అనే మహిళ అడ్డుకోడానికి ప్రయత్నించింది. దీంతో వారు తమతోపాటు తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశారు. దీంతో ఆమె అరవడంతో చుట్టుపక్కల వారు ఆ ఇంటి వైపు వస్తుండడాన్ని గమనించిన దుండగులు అక్కడి నుండి పారిపోయారు.

రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటున్న పద్మవతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్స అందిస్తున్నామని,ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, జాగిలాలను రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సిసి టీవి పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇది దోపిడీ దొంగల పనేనని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.