రోజా ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్: ఘన స్వాగతం పలికిన ఫైర్ బ్రాండ్
తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రోజా మరియు ఆమె కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. రోజా ఇంటి దగ్గర ఆతిథ్యం స్వీకరించిన అనంతరం కేసీఆర్ నేరుగా తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుని రాత్రికి హైదరాబాద్ బయలుదేరుతారు.
చిత్తూరు: చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లారు. సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే రోజా ఘన స్వాగతం పలికారు. కంచిలోని శ్రీ అత్తివరద రాజస్వామిని దర్శించుకున్న కేసీఆర్ అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గం గుండా ఎమ్మెల్యే రోజా ఇంటికి చేరుకున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రోజా మరియు ఆమె కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. రోజా ఇంటి దగ్గర ఆతిథ్యం స్వీకరించిన అనంతరం కేసీఆర్ నేరుగా తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుని రాత్రికి హైదరాబాద్ బయలుదేరుతారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ కు రోజా ఘన స్వాగతం(వీడియో)
నగరిలో కేసీఆర్కు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే రోజా