Asianet News TeluguAsianet News Telugu

సాంకేతిక సమస్యలు: ఏపీలో నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో  రిజిస్ట్రేషన్ల  ప్రక్రియ  ఇవాళ  నిలిచిపోయింది.   సాంకేతిక  సమస్యతో   భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. 

Technical glitches to land registration in Andhra Pradesh lns
Author
First Published May 29, 2023, 5:54 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో  సాంకేతిక  సమస్యలతో  భూముల రిజిస్ట్రేసన్లు  నిలిచిపోయాయి.  భూముల  రిజిస్ట్రేషన్లు  నిలిచిపోవడంతో  అధికారులతో  రిజిస్ట్రేషన్ల  కోసం  వచ్చిన  వారు  వాగ్వాదానికి దిగారు.  ఇవాళ  ఉదయం  నుండి  రిజిస్ట్రేషన్  కార్యాలయాల్లోని  కంప్యూటర్లు   మొరాయించాయి. ఎప్పటివరకు  ఈ పరిస్థితి  ఎప్పుడు  మెరుగు కానుందో  కూడ  అధికారుల  నుండి  స్పష్టత  లేదని  రిజిస్ట్రేషన్ల  కోసం  కార్యాలయాలకు  వచ్చినవారంతా  చెబుతున్నారు. 

ఈ ఏడాది జూన్  1వ తేదీ నుండి ఏపీ రాష్ట్రంలో  భూముల ధరలు పెంచే అవకాశం ఉందని  ప్రచారం సాగుతుంది. దీంతో  రిజిస్ట్రేషన్ కార్యాలయాలు  కిక్కిరిసిపోయాయి.  రిజిస్ట్రేషన్ కార్యాలయంలో  కంప్యూటర్లు  మొరాయించడంతో  రిజిస్ట్రేషన్ల కోసం వెళ్లిన వారంతా  ఇబ్బంది పడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios