విజయానికి నంద్యాల మోడల్ అంటే అవినీతే
- టీడీపీ విజయానికి మోడల్ అంటే అవినీతి, ప్రలోబాలే.
- ఒక్క నంద్యాల గెలుపు కోసం వందల కోట్ల ఖర్చు చేశారు.
- చంద్రబాబు గెలుపు కోసం ఎంతకైనా దిగజారుతారని ఎద్దేవా.
టీడీపీ విజయానికి మోడల్ అంటే అవినీతి, ప్రలోబాలే అని వైసీపీ సినీయర్ నేత పార్థసారథి ధ్వజమెత్తారు. నంద్యాల్లో గెలిచామని డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు వందల కోట్ల ఖర్చు చేశారన్న విషయం తెలియదా.. అని ప్రశ్నించారు. పరిపాలన గాలికొదిలేసి నంద్యాల ప్రజలను బెదిరింపులకు దిగి గెలిచారని విమర్శించారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పై నిప్పులు చెరిరారు.
చంద్రబాబు గెలుపు కోసం ఎంతకైనా దిగజారుతారని, అందుకు నిదర్శనం నంద్యాల ఎన్నిక అని పార్థసారథి ఎద్దేవా చేశారు. గతంలో జరిగిన చాలా బై ఎలక్షన్స్ లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కని విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కడపలో అయితే టీడీపీకి లక్ష ఓట్లు పడితే, వైసీపీకి ఆరు లక్షలతో ఘనవిజయం సాధించిందని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉండి ప్రతిపక్షాన్ని, ప్రజలను బెదించారని ఆరోపించారు. చివరకు తమ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ని కూడా బెదిరించారంటే టీడీపీ ఏ స్థాయిలో భయాందోళలకు గురిచేసిందో అర్థమవుతోందన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో అభివృద్ది నినాదంతోనే టీడీపీ నిజంగా గెలిచి ఉంటే పిరాయింపు ఎమ్మెల్యేలతో తక్షణం రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. వైసీపీ అభ్యర్థికి ఓటు వేసిన నంద్యాల ప్రజలకు పేరు పేరున ధన్యవాదులు తెలిపారు.
మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి