Ganta Srinivasa Rao: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Sriniavasa Rao) రాజీనామాను దాదాపు మూడేళ్ల తర్వాత  అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం  మంగళవారం ఆమోదించడం చర్చనీయాంశమైంది. అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేయగా.. ఇప్పటివరకూ పెండింగ్ లో ఉంచిన స్పీకర్ ఇప్పుడు ఆమోద ముద్ర వేశారు. ఈ చర్యపై  గంటా శ్రీనివాస్ ఏమన్నారంటే? 

Ganta Srinivasa Rao: టీడీపీ విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. దాదాపు మూడేళ్ల తర్వాత గంటా శ్రీనివాసరావు రాజీనామాను మంగళవారం ఆమోదించడం చర్చనీయాంశమైంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రం తీసుకున్న చర్యకు నిరసనగా గంటా రాజీనామా చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వ్యక్తిగత అభ్యర్థనలు ఉన్నప్పటికీ స్పీకర్ అభ్యర్థనపై చర్య తీసుకోలేదు. ఏప్రిల్‌లో ముగ్గురు వైఎస్సార్‌సీపీ సభ్యుల పదవీకాలం ముగియనున్న రాజ్యసభ ఎన్నికల కారణంగా ఇప్పుడు రాజీనామాను ఆమోదించే చర్య తీసుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన అభ్యర్థిని గెలిపించడానికి టీడీపీకి తగినంత మంది ఎమ్మెల్యేలు లేనప్పటికీ, వైఎస్సార్సీపీ తన టర్మ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్‌ను చూసినందున ఎటువంటి అవకాశాలను తీసుకోనట్లు కనిపిస్తోంది. ఈ చర్య టీడీపీ అభ్యర్థిని గెలిపించే అవకాశాలను బలహీనపరుస్తుంది.

ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యేగా వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వైదొలిగిన ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాకు స్పీకర్‌ ఆమోదం తెలపకపోవడం గమనార్హం. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గంటా నెల్లిమర్ల నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి

తన రాజీనామా ఆమోదంపై గంటా శ్రీనివాసరావు స్పందించారు. మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదిస్తారా.? అని ప్రశ్నించారు. తాను అప్పుడు స్పీకర్ ను వ్యక్తిగతంగా కలిసి రాజీనామా ఆమోదించాలని చెప్పినా పెండింగ్ పెట్టారని, కానీ, ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగా.. ఆమోదించారని సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా ఆమోదించే ముందు తన అభిప్రాయం తీసుకోవాలనే కనీస సంప్రదాయాన్ని కూడా పట్టించుకోలేదని విమర్శించారు. ఈ చర్యతోనే సీఎం జగన్ ఎంతగా భయపడుతున్నాడో అర్థమవుతోందని అన్నారు.

సీఎం జగన్ లో రాజ్య సభ సీట్ల భయం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఉన్నా 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా ఓటేస్తారనే అనుమానం జగన్ లో ఉందేమో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నా.. రాజకీయ లబ్ధి కోసమే సీఎం జగన్ తన రాజీనామాను ఆమోదింపచేసి స్టీల్ ప్లాంట్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు.

నిజంగా సీఎం జగన్ రెడ్డికి ఆత్మ గౌరవం ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలనీ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా దమ్ముందా అని సవాల్ విసిరారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా తనకున్న అవకాశాలపై న్యాయ సలహా తీసుకుంటాని గంటా శ్రీనివాస్ స్పష్టం చేశారు.