టిడిపి ఎంపీ సీఎం రమేష్పై వాట్సాప్ చర్యలు...
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద రాజకీయ పోస్టులు, కామెంట్లపై కఠినంగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియా సంస్థలు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్ సంస్థలు ఈ విషయంలో సీరియస్ గా వున్నాయి. వాట్సాప్ సంస్థ ఏకంగా రాజకీయ నాయకుల అకౌంట్లపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మొదటి వికెట్ పడింది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద రాజకీయ పోస్టులు, కామెంట్లపై కఠినంగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియా సంస్థలు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్ సంస్థలు ఈ విషయంలో సీరియస్ గా వున్నాయి. వాట్సాప్ సంస్థ ఏకంగా రాజకీయ నాయకుల అకౌంట్లపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మొదటి వికెట్ పడింది.
తెలుగు దేశం పార్టీ పార్టీ ఎంపీ సీఎం రమేష్కు చెందిన వాట్సాప్ అకౌంట్ ను సదరు సంస్థ బ్లాక్ చేసింది. ఆయన తాము విధించిన నిబంధనలను ఉళ్లంఘించడం వల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆయన వాట్సాప్ అకౌంట్ పై తమకు పలు ఫిర్యాదులు అందాయని...వాటి ఆదారంగా విచారణ జరిపే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అయితే ఇలా కీలకమైన ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే తనపై ఇలాంటి కుట్రలు చేస్తోందని సీఎం రమేష్ ఆరోపించారు. తాన వాట్సాప్ అకౌంట్ పనిచేయకపోవడంపై ఇప్పటికే ఆ సంస్థకు లేఖ రాసినట్లు తెలిపారు. ఇదే వాట్సప్ అకౌంట్ ద్వారా ప్రజలు తనతో వారి సమస్యల గురించి ఫిర్యాదు చేస్తుంటారని...హటాత్తుగా ఇలా అకౌంట్ బ్లాక్ చేయడం వల్ల వాళ్లతో తన సంబంధాలు తెగిపోయే అవకాశం వుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.