Asianet News TeluguAsianet News Telugu

క్రీడా ప్రాంగణ నిర్మాణానికి స్థలం రద్దు: జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు లేఖ

విశాఖపట్టణంలో క్రీడా ప్రాంగణ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయంలో కేటాయించిన స్థలాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం సరైంది కాదని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు చెప్పారు.  ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన సీఎంను కోరారు.

TDP MLA Gana Babu appeals to CM YS Jagan to rethink move to drop sports complex
Author
Visakhapatnam, First Published Aug 18, 2020, 11:13 AM IST


విశాఖపట్టణం: విశాఖపట్టణంలో క్రీడా ప్రాంగణ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయంలో కేటాయించిన స్థలాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం సరైంది కాదని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు చెప్పారు.  ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన సీఎంను కోరారు.

పట్టణంలోని గోపాలపట్నం ఆగనంపూడిలో క్రీడా ప్రాంగణం నిర్మాణానికి టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో స్థలం కేటాయించింది. అయితే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం స్థల కేటాయింపును రద్దు చేసింది. ఈ విషయమై ఎమ్మెల్యే గణబాబు సీఎం జగన్ కు లేఖ రాశాడు. ప్రభుత్వ నిర్ణయం సరైందికాదని ఆయన చెప్పారు. ఓ క్రీడాకారుడిగా ప్రభుత్వ నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

TDP MLA Gana Babu appeals to CM YS Jagan to rethink move to drop sports complex

అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని పోటీలకు ఉపయోగపడేలా 150 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం నిర్మించాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం భూమిని కేటాయించిన విషయాన్ని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే 80 ఎకరాలను శాప్ కు అప్పగించినట్టుగా చెప్పారు. మరో 70 ఎకరాలు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. క్రీడా ప్రాంగణం రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios