Asianet News TeluguAsianet News Telugu

ఆ ఎన్నికల్లోనూ మేం ఓడితే... టిడిపిని శాశ్వతంగా మూసేస్తాం: బుద్దా వెంకన్న సవాల్ (వీడియో)

పరిషత్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించామని జబ్బలు చరుచుకుంటున్న వైసిపి దమ్ముంటే ఇప్పుడే  అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు రావాలని టిడిపి నాయకులు బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.  

tdp leader budda venkanna challenge to  ysrcp
Author
Vijayawada, First Published Sep 20, 2021, 11:41 AM IST

విజయవాడ: 2024ఎన్నికలలో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి నాయకులు బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు నాయుడు సిఎం కాగానే వంద ఎకరాల్లో పిచ్చాసుపత్రి నిర్మిస్తామని తెలిపారు. అందులో వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలను చేర్పించి ఇప్పుడు వారు మాట్లాడుతున్న మాటలను వారికే చూపిస్తామని... ఆ తర్వాత  వైద్యులతో ప్రత్యేక వైద్యం అందిస్తామని ఎద్దేవా చేశారు. 

''ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపిటీసి ఎన్నికలను టిడిపి బహిష్కరించింది. కానీ నిన్న ఫలితాల తరువాత టిడిపిపై గెలిచామని వైసిపి నేతలు జబ్బలు చరుస్తున్నారు. నిజంగానే మీకు ప్రజాబలం ఉంటే..‌ ఇప్పుడే అసెంబ్లీ ఎన్నికలకు రండి... అందులో మేము ఓడితే... టిడిపినే మూసేస్తాం'' అని సవాల్ విసిరారు.

''మా నాయకుడు చంద్రబాబు మీదకు వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి వచ్చారు. దీంతో మేమంతా కలిసి వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నాం. మేమే రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం. అలాంటిది  మా మీద ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం అన్యాయం'' అన్నారు. 

వీడియో

''పోలీసు అధికారులు సంఘంతో కూడా మాకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పిస్తున్నారు. కొందరు పోలీసు అధికారులయితే రాజకీయ వ్యవస్థ కంటే ఘోరంగా మాట్లాడుతున్నారు. కొంతమంది పోలీసులే తమ ప్రమోషన్ల కోసం ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు. మా అధినేత ఇంటి మీదకు వచ్చిన జోగి రమేపై బెయిల్ బుల్ సెక్షన్లా? గొడవను ఆపిన మా మీద ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ల కింద కేసులా? పోలీసు అధికారులు సంఘం దీనిని ఎందుకు  ప్రశ్నించడం లేదు'' అని బుద్దా నిలదీశారు.

read more  ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేసింది: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై అచ్చెన్నాయుడు

''మేము దళితుల పేరుతో ఎక్కడైన దూషించామా... నిరూపించండి.  చంద్రబాబు, ఆయన సామాజిక వర్గంపై జోగి రమేష్ మాట్లాడారు. కులాల కుంపట్లు పెట్టి రెచ్చ గొట్టింది వాళ్లు. తప్పుచేసిన వారిని వదిలేసి మాపై అన్యాయంగా కేసులు పెడుతున్నారు. మీ తీరు ఇలాగే సాగితే చత్తీస్‌గఢ్ తరహాలో ప్రజలు పోలీసులపై తిరగబడే రోజు వస్తుంది'' అని హెచ్చరించారు. 

''ప్రభుత్వ పెద్దలకు వంత పాడటం పోలీసు అధికారులు సంఘం మానుకోవాలి. కొంతమంది చేసే తప్పులకు వ్యవస్థ మొత్తం నింద మోయాల్సి వస్తుంది. ఇప్పటికే ఆంద్రా పోలీసు అంటే సినిమా పోలీసు అనే అపవాదు మూట కట్టుకున్నారు. మీ స్వార్ధ ప్రయోజనాల కోసం నిజాయితీ అధికారులు జీవితాలను బలి చేయవద్దు. వరుస సంఘటనలు పరిశీలించి అప్పుడు సంఘాలు న్యాయంగా స్పందిస్తే స్వాగతిస్తాం'' అన్నారు.

''పోలీసులు కూడా వైసిపి ప్రభుత్వం ఎప్పుడు దిగి పోతుందా అని ఎదురు చూస్తున్నారు. కొంతమంది చట్టాన్ని జగన్ కు చుట్టంగా మార్చేశారు. మాపై అన్యాయంగా పెట్టిన కేసులను పోలీసులు ఉపసంహరించు కోవాలి. డిజిపికి మెమోరాండం ఇచ్చేందుకు వెళితే మాపై కేసులు ఏంటి? పోలీసు అధికారుల సంఘం మాకు జరిగిన అన్యాయంపై స్పందించాలి. ఈ కేసులపై పోలీసు అధికారులు వారి అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. అక్రమ కేసులపై మా పోరాటం కొనసాగుతుంది'' అని బుద్దా స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios