Asianet News TeluguAsianet News Telugu

Chandrababu Naidu: చంద్ర‌బాబు ఆరోగ్యంపై కుటుంబ స‌భ్యుల ఆందోళ‌న..

Rajamahendravaram: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు గురువారం జ్యుడీషియల్ కస్టడీని నవంబర్ 1 వరకు పొడిగించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయ‌న‌ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మాజీ సీఎం జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియనుండడంతో కోర్టు దానిని రెండు వారాలు పొడిగించింది. అయితే, చంద్ర‌బాబు ఆరోగ్యం పై ఆయ‌న కుటుంబ స‌భ్యులు, టీడీపీ నాయకులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Tdp chief N Chandrababu Naidu's family members express concern over his health  RMA
Author
First Published Oct 20, 2023, 1:06 AM IST

Chandrababu Naidu’s health: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు గురువారం జ్యుడీషియల్ కస్టడీని నవంబర్ 1 వరకు పొడిగించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయ‌న‌ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మాజీ సీఎం జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియనుండడంతో కోర్టు దానిని రెండు వారాలు పొడిగించింది. అయితే, చంద్ర‌బాబు ఆరోగ్యం పై ఆయ‌న కుటుంబ స‌భ్యులు, టీడీపీ నాయకులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ప‌లు కుంభ‌కోణాల‌కు సంబంధించి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న‌ చంద్రబాబు నాయుడును కుటుంబ సభ్యులు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణిలు కలిశారు. దాదాపు 40 నిమిషాల ములాకత్ అనంతరం జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. మొన్నటి ములకత్ లాగా ఈసారి కూడా మీడియా పాయింట్ దగ్గర ఆగలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన లోకేష్ తో మాజీ మంత్రులు కిమిడి కళా వెంకటరావు, నిమ్మకాయల చినరాజప్ప, కొల్లు రవీంద్ర తదితరులు మాట్లాడారు. చంద్ర‌బాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని కళా వెంకటరావు తెలిపారు. చంద్ర‌బాబుకు వేసిన మందులు పెద్దగా ఉపశమనం కలిగించలేదని కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు.

ఆయ‌న‌కు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులకు నివేదిక ఇచ్చేందుకు జైలు అధికారులు నిరాకరించారని వెంకటరావు తెలిపారు. వైద్య పరీక్షల నివేదికలు అందుబాటులో ఉంటే వల్ల కుటుంబీకులు కుటుంబ వైద్యులను సంప్రదించి పరిస్థితిని సమీక్షించుకునేందుకు వీలుంటుందని ఆయన అన్నారు. జైలు అధికారులు జైలు మాన్యువల్‌ను పాటించడం లేదనీ, అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. చంద్ర‌బాబుకు ఆరోగ్యం బాగోలేదని విని బాధపడ్డానని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యానికి సంబంధించిన వాస్తవాలను జైలు అధికారులు అందించడం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చట్టాలలోని లొసుగులను ఉపయోగించుకుని వ్యవస్థను దుర్వినియోగం చేసి చంద్రబాబును నకిలీ కేసుతో జైలులో పెట్టారని ఆయన ఆరోపించారు. సంఘీభావం తెలిపేందుకు చంద్ర‌బాబు భార్య భువనేశ్వరిని టీడీపీ నేతలు కలవకుండా అధికార యంత్రాంగం అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ నేతలను గృహనిర్భందంలో ఉంచి ప్రతిపక్షాలను అణిచివేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి అప్రజాస్వామిక పాలన సాగలేదన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios