Asianet News TeluguAsianet News Telugu

మాగుంట రవీంద్ర మృతితో నా గుండె బరువెక్కింది..: చంద్రబాబు ఆవేదన

ఇప్పటికే ఒక కొడుకుని పోగొట్టుకుని పుత్రశోకంతో ఉన్న మాగంటి దంపతులు ఇప్పుడు మరో కొడుకును కోల్పోవటం చూసి బాధతో తన గుండె బరువెక్కిందన్నారు చంద్రబాబు నాయుడు. 

TDP Chief Chandra babu Condoles Death Of Maganti Ravindra akp
Author
Guntur, First Published Jun 2, 2021, 10:43 AM IST

గుంటూరు: మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రవీంద్ర మృతి  బాధాకరమని... ఆయన మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆవేధన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒక కొడుకుని పోగొట్టుకుని పుత్రశోకంతో ఉన్న మాగంటి దంపతులు ఇప్పుడు మరో కొడుకును కోల్పోవటం చూసి బాధతో తన గుండె బరువెక్కిందన్నారు. ఇలాంటి బాధాకర పరిస్థితుల్ని తట్టుకుని నిలబడేలా వారి కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని, రవీంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ దేవున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు చంద్రబాబు. 

ఇక మాగంటి రవీంద్ర మృతిపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా సంతాపం ప్రకటించారు. ''టిడిపి సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు గారి రెండో కుమారుడు రవీంద్రనాథ్ మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇటీవల పెద్ద కొడుకు రాంజీ మరణంతో శోకసంద్రంలో వున్న మాగంటి బాబు గారి కుటుంబానికి రవీంద్రనాథ్ మృతి అంతులేని విషాదాన్ని మిగిల్చింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను'' అని లోకేష్ ట్వీట్ చేశారు. 

''టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రవీంద్ర మృతి  బాధాకరం. ఒక ఏడాది వ్యవధిలొనే మాగoటి బాబు తన ఇద్దరు కుమారులను కోల్పోవడం విషాదకరం. ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకుని నిలబడేలా వారి కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని, రవీంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. ఇంతకాలం టీడీపీకి అండగా ఉన్న మాగంటి కుటుంబానికి ఈ కష్టకాలంలో టీడీపీ కుటుంబమంతా అండగా ఉంటుంది'' అని ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవేధన వ్యక్తం చేశారు. 

read more  నెలల వ్యవధిలో మరో కొడుకు కూడా: టీడీపీ నేత మాగంటి బాబు చిన్న కుమారుడు రవీంద్ర మృతి

టిడిపి మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు మాగంటి రవీంద్ర మద్యానికి బానిసై అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రి పాలయ్యాడు. అయితే ఆయన ఆసుపత్రి నుంచి తప్పించుకుని హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో తలదాచుకున్నారు. ఈ క్రమంలో రక్తపు వాంతులతో అదే హోటల్‌లోనే రవీంద్ర కన్నుమూశారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఆయన కొద్ది రోజుల పాటు ఏలూరు ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను విజయవాడ ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించింది. దీంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఇలా ఒకే ఏడాదిలో ఇద్దరు కొడుకులను కోల్పోయాడు మాగంటి బాబు.

Follow Us:
Download App:
  • android
  • ios