Asianet News TeluguAsianet News Telugu

నగరిలో ఉద్రిక్తత... రోజాపై దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు

నగరిలో ఉద్రిక్తత... రోజాపై దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు

TDP activists attack on YCP MLA Roja at Nagari

చిత్తూరు జిల్లా నగరిలో ఉద్రిక్త పరిస్ధితులు చోటుచేసుకుంది. నగరిలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించేందుకు మంత్రి అమర్‌నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే రోజా కూడా అక్కడికి చేరుకున్నారు.. అయితే ఆమెను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. మంత్రి అమర్‌నాథ్ రెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరిగింది.. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios