కియా సంస్థతో చర్చించలేదు: స్పష్టం చేసిన తమిళనాడు
కియా పరిశ్రమ యాజమాన్యంతో తాము ఎలాంటి చర్చలు జరపలేదని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది.
చెన్నై: కియా సంస్థతో తమ ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపలేదని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో తాము మంచి సంబంధాలను కోరుకొంటున్నట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Also read:కియాపై తప్పుడు ప్రచారం, చర్యలు తప్పవు:బుగ్గన
ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి ఏపీ రాష్ట్ర పరిశ్రమల కార్యదర్శికి ఫోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కియా కార్ల పరిశ్రమ తమిళనాడు రాష్ట్రానికి తరలివెళ్లిపోయే అవకాశం ఉందని ఓ వార్తా కథనం ప్రచురించింది. ఈ వార్తలను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
ఇదే సమయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడ ఇదే తరహాలో స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి సంబంధం లేదని కియా మోటార్స్ యాజమాన్యం కూడ ప్రకటించింది. కియా మోటార్స్ ఏపీ రాష్ట్రం నుండి తరలివెళ్లే అవకాశం ఉందని ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.