Asianet News TeluguAsianet News Telugu

కడప జిల్లాలో దారుణం.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరిని చితకబాదిన స్వప్న బార్ సిబ్బంది...

మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులపై కడపలోని స్వప్న బార్ సిబ్బంది దాష్టీకం ప్రదర్శించారు. వారిని నడిరోడ్డులోకి లాగి విచక్షణారహితంగా దాడి చేశారు. 

Swapna bar staff attack two people who were in drunk situation in Kadapa - bsb
Author
First Published Jul 29, 2023, 7:13 AM IST

కడప : కడప జిల్లా బద్వేల్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానిక స్వప్న బార్ నిర్వాహకులు ఇద్దరు వ్యక్తులపై దౌర్జన్యం ప్రదర్శించారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరిని బార్ నుంచి రోడ్డు మీదికి లాగేశారు. ఆ తరువాత నడిరోడ్డుపై విచక్షణారహితంగా వారిని కొట్టారు బార్ సిబ్బంది. ఈ ఘటనను సెల్ఫోన్లో వీడియోలు తీస్తున్న వారి మీద కూడా దాడి చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios