విజయవాడలో గోవులు మరణించిన గోశాలను ఆదివారం భువనేశ్వరీ పీఠాధిపతి కమలానంద సరస్వతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గో సంరక్షణకు కేంద్రం రూ. 1,500 కోట్లు కేటాయించిందని.. ఆ డబ్బులు ఏ ఏ గోశాలలకు ఇచ్చారో చెప్పాలని కమలానంద డిమాండ్ చేశారు.
విజయవాడలో గోవులు మరణించిన గోశాలను ఆదివారం భువనేశ్వరీ పీఠాధిపతి కమలానంద సరస్వతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గో సంరక్షణకు కేంద్రం రూ. 1,500 కోట్లు కేటాయించిందని.. ఆ డబ్బులు ఏ ఏ గోశాలలకు ఇచ్చారో చెప్పాలని కమలానంద డిమాండ్ చేశారు.
ఒకేసారి ఇన్ని ఆవులు చనిపోవడం బాధాకరమని.. ఈ ఘటనలో గోశాల నిర్వాహకుల నిర్లక్ష్యం ఉన్నట్లుగా అనిపిస్తుందని ఆయన ఆరోపించారు. గోశాలలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలని కమలానంద అభిప్రాయపడ్డారు.
విజయవాడ నగర శివారులోని కొత్తూరు తాడేపల్లిలో ఉన్న గోశాలలో శనివారం 110 ఆవులు మరణించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
