Asianet News TeluguAsianet News Telugu

నిమ్మగడ్డ పంచాయతీ: జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్

 స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విషయమై ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం షాకిచ్చింది.
 

Supreme court returns ap government petion on high court order over ap local body elections lns
Author
Guntur, First Published Jan 22, 2021, 2:13 PM IST

న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విషయమై ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం షాకిచ్చింది.

ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మొత్తం తప్పుల తడకగా ఉందని ఆ పిటిషన్ ను సరిచేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అంతేకాదు పిటిన్ ను వెనక్కి ఇచ్చేసింది. ఈ క్రమంలో ఇవాళే రిజిస్ట్రీ పిటిషన్ ను సరిచేసి దాఖలు చేయలేకపోవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

సోమవారం వరకు పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ ఆదివారం నాడు విడుదల కానుంది. 

ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఐదు విడుతలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ఎన్నికల సంఘం ఈ నెల 8వ తేదీన షెడ్యూల్ ప్రకటించింది.ఈ షెడ్యూల్ ను ఏపీ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది.

also read:ఏపీలో స్థానిక సంస్థల పంచాయితీ: సుప్రీంలో ఉద్యోగుల జేఏసీ పిటిషన్

సింగిల్ జడ్జి ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ఈ నెల 11న సస్పెండ్ చేశారు.ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం ముందు ఎన్నికల సంఘం సవాల్ చేసింది.

ఎన్నికలను నిర్వహించేందుకు ఏపీ హైకోర్టు ధర్మాసనం ఈ నెల 21న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఏపీ హైకోర్టు ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ గురువారం నాడే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆ పిటిషన్ లో ప్రభుత్వం కోరింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios