Asianet News TeluguAsianet News Telugu

మంగళగిరిలో టీడీపీ ఆఫీస్: సుప్రీంకోర్టు నోటీసులు

గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి భూ కేటాయింపుల అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో ఈ విషయమై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Supreme court issues notice to TDP over land allocation to TDP office construction in Mangalagiri lns
Author
New Delhi, First Published Oct 27, 2020, 12:06 PM IST

న్యూఢిల్లీ: గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి భూ కేటాయింపుల అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో ఈ విషయమై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి భూ కేటాయింపుల విషయంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ మేరకు టీడీపీకి నోటీసులు జారీ చేసింది.

టీడీపీతో పాటు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏకు నోటీసులిచ్చింది. మూడు వారాల తర్వాత ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఇదే విషయమై గతంలో ఏపీ హైకోర్టులో మంగళగిరి ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎమ్మెల్యే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఉత్తర్వులపై  ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios