Asianet News TeluguAsianet News Telugu

అరసవల్లిలో రెండో రోజూ ఆదిత్యుడిని తాకిన సూర్య కిరణాలు

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూల విరాట్టును మంగళవారం నాడు కూడ సూర్య కిరణాలు తాకాయి. సోమవారం నాడు కూడ స్వామివారిని  సూర్యకిరణాలు తాకిన విషయం తెలిసిందే.

 

Sunrays touch Arasavalli deity for 10 minutes
Author
Srikakulam, First Published Mar 10, 2020, 8:10 AM IST

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూల విరాట్టును మంగళవారం నాడు కూడ సూర్య కిరణాలు తాకాయి. సోమవారం నాడు కూడ స్వామివారిని  సూర్యకిరణాలు తాకిన విషయం తెలిసిందే.

ఈ సమయంలో స్వామి బంగారుఛాయలోకి మారి భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం నాడు  ఉదయం 6: 25 గంటల నుండి 6: 34 గంటల వరకు సూర్య కిరణాలు ఆదిత్యుని పాదాలను తాకాయి.  మంగళవారం నాడు కూడ సుమారు ఏడు నిమిషాల పాటు సూర్య కిరణాలు  తాకాయి.

అరసవల్లి సూర్యనారాయణమూర్తి ఆలయంలో సూర్య కిరణాలు  రెండో రోజూ కూడ తాకాయి.  ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు బారులు తీరారు. రెండు రోజులుగా భక్తులు ఈ ఆలయాన్ని తండోపతండాలుగా సందర్శిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios