వైఎస్ వివేకా హత్య కేసు... ఆదినారాయణకు సిట్ ప్రశ్నలు
హత్య జరిగిన రోజే కొందరు వైకాపా నాయకులు ఆదినారాయణరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.పది రోజుల నుంచి కడపలో జరుగుతున్న సిట్ విచారణలో పలువురు కీలక నేతలను విచారిస్తున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో గురువారం కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రానికి విచారణకు హాజరు కావాలని సీఆర్పీసీ 160 కింద నోటీసు ఇచ్చారు.
మార్చి 15న పులివెందులలో వివేకా హత్య జరిగితే... 8 నెలల తర్వాత మాజీమంత్రిని విచారణకు పిలుస్తున్నారు. హత్య జరిగిన రోజే కొందరు వైకాపా నాయకులు ఆదినారాయణరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.పది రోజుల నుంచి కడపలో జరుగుతున్న సిట్ విచారణలో పలువురు కీలక నేతలను విచారిస్తున్నారు.
Also Read: తమ్ముడు నిరసన, అన్నయ్య ప్రశంసలు: జగన్ నిర్ణయంపై మెగాస్టార్ హర్షం
ఇందులో భాగంగా నేడు ఉదయం ఆదినారాయణరెడ్డి విచారణకు హాజరుకానుండటం చర్చనీయాంశమైంది. ఈనెల 5న ఆదినారాయణరెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డిని సైతం సిట్ అధికారులు విచారించారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని... తప్పుందని తేలితే బహిరంగంగా ఉరేసుకుంటానని ఇప్పటికే అదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. వివేకా కేసు విచారణ సిట్కు చేతకాకుంటే సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read:వైసీపీ సర్కార్ కి జేసీ టైటిల్ ఇదే.....: జగన్ కు సెల్యూట్ చేసిన దివాకర్ రెడ్డి