శ్రీకాకుళం జిల్లాలో ముందుకొచ్చిన సముద్రం.. చంద్రగ్రహణం ప్రభావమేనా..?
శ్రీకాకుళం జిల్లాలో సముద్రం ముందుకు రావడం కలకలం రేపుతోంది.. సోంపేట మండలం నడమూరు దగ్గర సముద్రం ఉన్నట్లుండి 20 మీటర్లు ముందుకు వచ్చింది. సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు
శ్రీకాకుళం జిల్లాలో సముద్రం ముందుకు రావడం కలకలం రేపుతోంది.. సోంపేట మండలం నడమూరు దగ్గర సముద్రం ఉన్నట్లుండి 20 మీటర్లు ముందుకు వచ్చింది. సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మరోవైపు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని తీర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా.. చంద్రగ్రహణం కారణంగానే సముద్రం ముందుకు వచ్చిందని జనం అంటున్నారు. అయితే పౌర్ణమి సందర్భంగా సముద్రం అటుపోట్లకు గురికావడంత సహజమేనని.. దానిలో భాగంగానే ఇలా జరిగిందని కొందరు హేతువాదులు అంటున్నారు.