Asianet News TeluguAsianet News Telugu

తలపై నుండి దూసుకెళ్లిన వాహనం... బైకర్ దారుణ మృతి

ఓ ద్విచక్రవాహనదారుడు ఆటోను ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయాడు. 

road accident at krishna district... one person death akp
Author
Pedana, First Published Jun 7, 2021, 12:01 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లాలోని పెడన సమీపంలో జాతీయ రహదారి 216పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ ద్విచక్రవాహనదారుడు ఆటోను ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదానికి గురయ్యాడు. అతడు రోడ్డుమీద పడిపోగా వెనకనుండి వచ్చిన వాహనం తలపైనుండి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. 

బందరు మండలం మంగినపూడి శివారు రెడ్డి పాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పని వుండటంతో తన బైక్ పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే అతడు జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ పెడన సమీపంలోని బంటుమిల్లి రోడ్డు సింగరాయపాలెం ప్రాంతం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వేగంగా వెళలుతూ ఓ ఆటోను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించి అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఇదే సమయంలో వెనకాలనుండి వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం అతడి తలపైనుండి దూసుకెళ్లింది. దీంతో తల చిధ్రమై బైకర్ అక్కడిక్కడే చనిపోయాడు. 

read more  వాహనదారులకు అలెర్ట్: హెల్మెట్లపై కొత్త నిబంధనలు.. పాటించకపోతే జరిమానాతో పాటు జైలు శిక్ష..

అతడి తలపై ఎక్కడంతో టాటా ఏస్ వాహనం కూడా అదుపుతప్పింది. దీంతో అందులోని కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పెడన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే ప్రమాదానికి కారణమైన వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios