Asianet News TeluguAsianet News Telugu

పట్టపగలే నడిరోడ్డుపై బాలికపై అత్యాచార యత్నం.. అడిగిన తల్లిదండ్రులపై దాడి...

నెల్లూరు జిల్లాలో పట్టపగలే.. నడిరోఢ్డులో ఓ బాలికమీద అత్యాచారయత్నం చేశాడో యువకుడు. ఆమె తల్లిదండ్రుల మీదా దాడికి తెగబడ్డాడు. 

Rape attempt on girl on the road in broad daylight, Attack on parents In nellore - bsb
Author
First Published Apr 29, 2023, 10:15 AM IST

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్లోని శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. శుక్రవారం పట్టపగలు జిల్లాలోని  సంఘం మండలానికి చెందిన ఓ గ్రామంలో 15 ఏళ్ల బాలికపై  నడివీధిలో అత్యాచారయత్నం జరిగింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు ఈ విధంగా తెలియజేశారు. 15 ఏళ్ల బాధిత బాలిక దగ్గర్లోని దుకాణానికి వెళ్లి తిరిగి వస్తోంది.  ఆ సమయంలో కే రమేష్ అనే యువకుడు టూ వీలర్ మీద వచ్చి బాలికను అడ్డగించాడు. 

బాలిక ఒంటిమీద చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను బలవంతంగా తన టు వీలర్ మీదికి ఎక్కించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో తీవ్రంగా భయపడిపోయిన బాలిక.. అతని నుంచి తప్పించుకుని ఇంటికి పరుగు తీసింది. తల్లిదండ్రులకు ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందించింది.  దీంతో వెంటనే వారు నిందితుని పట్టుకుని నిలదీశారు. తల్లిదండ్రుల మీద కూడా నిందితుడు దాడి చేశాడు. పోలీసులకు సమాచారం అందించగా..  కేసు నమోదు,  దర్యాప్తు ప్రారంభించారు. 

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని కొరికిన ఎలుకలు !

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 26వ తేదీన ఊటీలో ఇలాంటి దారుణమే వెలుగు చూసింది. తమిళనాడులోని ఊటీలో ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని హత్యాచారానికి గురైంది. ఆ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆ తర్వాత అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా తేలింది. సోమవారం ఉదయం ఊటీ బైక్రా ప్రాంతానికి  దగ్గర్లో ఉన్న ఓ కుగ్రామం నుంచి స్కూలుకు వెళ్ళింది ఆ బాలిక. ఆ తర్వాత అక్కడ నుంచి తిరిగి రాలేదు. రావాల్సిన టైంకు ఇంటికి కూతురు తిరిగి వచ్చే టైం అయిపోయానా.. రాక పోవడంతో తల్లిదండ్రులు ఆ బాలిక కోసం అన్ని చోట్ల వెతికారు.

కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి అన్నిచోట్లా వెతికారు. ఈ క్రమంలో ఆంకార్ బోర్డు ప్రాంతంలో ఉన్న పొదలచాటున ఆ బాలిక మృతదేహం స్థానికులకు కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు మొదట దగ్గరికి వెళ్లి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. అది తమ కూతురుదే కావడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ హత్యాచారం మీద విచారణ జరిపారు. బాలికమృతదేహం పడి ఉన్న చోటుకు దగ్గరలో ఓ కారు పార్కు చేసి ఉండడం కనిపించింది. వెంటనే వారు ఆ కారు ఎవరిది అనే వివరాలను సేకరించారు. ఆ కారు కక్కకోడమందు ప్రాంతానికి చెందిన రాజేష్ కుట్టన్ కు చెందిందని గుర్తించారు.

వెంటనే అతని కోసం వెతకగా రాజేష్ కుట్టన్ పరారీలో ఉన్నాడని తేలింది. ఆ 9వ తరగతి బాలికను రాజేష్ కుట్టనే కారులో కిడ్నాప్ చేసి ఉంటాడని..  తర్వాత అనుచరులతో కలిసి అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటాడని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో భాగంగా భావిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు బాలికను అత్యాచారం చేసి, హత్య చేసినవారిని అరెస్టు చేస్తేనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని నిరసన తెలిపారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. దీంతో కుటుంబసభ్యులు శాంతించి పోస్టుమార్టానికి ఒప్పుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios