బెజవాడ సమావేశానికి పుణ్యశీల డుమ్మా: ఏపీ కార్పోరేషన్ల మేయర్లు వీరే...
విజయవాడ కార్పోరేషన్ మేయర్ పదవిని ఆశించిన వైసీపీ కార్పోరేటర్ పుణ్యశీల సమావేశానికి గైర్హాజరయ్యారు. ఏపీలోని 11 కార్పోరేషన్ల మేయర్ల జాబితాను ఇక్కడ చూడండి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పోరేషన్లకు సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు గురువారం జరుగుతున్నాయి. విజయవాడ కార్పోరేషన్ మేయర్ పదవిని ఆశించిన పుణ్యశీల వైసీపీ నాయకత్వంపై అలక వహించారు. విజయవాడ మేయర్ గా భాగ్యలక్ష్మి పేరును వైసీపీ నాయకత్వం ఖరారు చేసింది. దీంతో పుణ్యశీల అలక వహించి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 11 కార్పోరేషన్ల మేయర్లు వీరే...
విజయవాడ - భాగ్యలక్ష్మి
విశాఖపట్నం - గొలగాని హరి వెంకటకుమారి
చిత్తూరు - ఆముద
గుంటూరు - కావటి మనోహర్ నాయుడు
విజయనగరం - వెంపడాపు విజయలక్ష్మి
మచిలీపట్నం - మోకా వెంకటేశ్వరమ్మ
తిరుపతి - డాక్టర్ శిరీష
కడప - సురేష్ బాబు
ఒంగోలు - గంగాడి సుజాత
అనంతపురం - వసీ సలీమ్
కర్నూలు - రామయ్య
డిప్యూటీ మేయర్లు వీరే...
నిజయవాడ - బెల్లం దుర్గ
విశాఖపట్నం - జియ్యాని శ్రీధర్
చిత్తూరు - చంద్రశేఖర్
గుంటూరు - వనమా బలవజ్ర బాబు
ఒంగోలు - వేమూరి సూర్యనారాయణ
కడప - షేక్ ముంతాజ్ బేగం
అనంతపురం - వాసంతి సాహిత్య
విజయనగరం - ముచ్చు నాగలక్ష్మి, శ్రావణి