Asianet News TeluguAsianet News Telugu

చెడ్డీ గ్యాంగ్ తో ఆ ప్రమాదం లేదు.. అపోహలే.. గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు...

gujarat రాష్ట్రంలోని చాహోత్ జిల్లా నుంచి చెడ్డి గ్యాంగ్ నగరంలోకి ప్రవేశించింది.  గత పది రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ సంచరిస్తుంది. కేవలం దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తమిళనాడు, kerala రాష్ట్రాల్లో తరచూ ఈ గ్యాంగ్ దోపిడీలు చేస్తుంటారని తెలిపారు. కేవలం రాత్రి సమయాల్లోనే నివాసాల మధ్య తిరుగుతూ చోరీలు చేయటమే వీరి లక్ష్యమని అని వివరించారు.
 

police searching speeding for cheddi gang in andhra pradesh
Author
Hyderabad, First Published Dec 11, 2021, 11:29 AM IST

విజయవాడ :  నగరంలో దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయకంపితులను  చేస్తున్న  cheddi gang కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. నగరంలోని Gunadala, Madhuranagar Railway Station ప్రాంతాలను శుక్రవారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరంలో చెడ్డీగ్యాంగ్ lock వేసిన ఇళ్లు, విల్లాలు, అపార్ట్మెంట్ లలో దొంగతనాలకు పాల్పడుతూ కలకలం సృష్టిస్తున్న రని..  దీని వలన ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారని అన్నారు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

దక్షిణాది రాష్ట్రాల్లోనే దోపిడీలు
gujarat రాష్ట్రంలోని చాహోత్ జిల్లా నుంచి చెడ్డి గ్యాంగ్ నగరంలోకి ప్రవేశించింది.  గత పది రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ సంచరిస్తుంది. కేవలం దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తమిళనాడు, kerala రాష్ట్రాల్లో తరచూ ఈ గ్యాంగ్ దోపిడీలు చేస్తుంటారని తెలిపారు. కేవలం రాత్రి సమయాల్లోనే నివాసాల మధ్య తిరుగుతూ చోరీలు చేయటమే వీరి లక్ష్యమని అని వివరించారు.

రైల్వే స్టేషన్ లే వీరి జాగాలు..
రాత్రుళ్లు దొంగతనాలకు పాల్పడే చెడ్డి గ్యాంగ్ సభ్యులు పగటిపూట యాత్రికులుగా నటిస్తారు. అందుకే దూర ప్రాంతాల నుంచి వచ్చి పోయే ప్రయాణికుల్లా రైల్వేస్టేషన్లలో ఉంటారు. ఎవరికీ అనుమానం రాకుండా అమాయకుల్లా నటిస్తూ, మోసం చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. దోపిడీలు పూర్తయిన తర్వాత వీరు రైలు మార్గాల ద్వారానే వారి వారి స్వస్థలాలకు చేరుకుంటారని పోలీస్ కమిషనర్ వివరించారు. సాధారణంగా వీరు అర్ధరాత్రి 1-4 గంటల మధ్య దొంగతనాలు చేస్తుంటారని చెప్పారు.

చడ్డీ గ్యాంగ్ గా అనుమానిస్తున్న ఇద్దరిని పట్టుకున్న పోలీసులు

దాడులు చేయరు..
చెడ్డి గ్యాంగ్ దోపిడీకి అడ్డు వచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడతారని, అవసరమైతే హత్య చేసేందుకు కూడా వెనకాడరని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇవి నమ్మదగినది కాదని సీపీ స్పష్టం చేశారు. గత పది రోజుల వ్యవధిలో నగరంలో మూడు చోట్ల ఈ చెడ్డీ గ్యాంగ్‌ చోరీలకు పాల్పడ్డారని, ఈ ఘటనలో సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు దోచుకుపోయారని, అయితే ఆయా ఘటనలో ఎవరి పైనా దాడి చేయలేదని అన్నారు.

ప్రత్యేక టీంల ఏర్పాటు..
చెడ్డి గ్యాంగ్ ను అదుపులోకి తీసుకునే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్యాంగ్ సభ్యుల కదలికలపై నిఘా ఉంచామని అన్నారు. ఇటీవల జరిగిన చోరీల సీసీ కెమెరాల ఫుటేజీలో సేకరించినట్లు చెప్పారు. నగర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో చెడ్డీగ్యాంగ్ పై సమాచారాన్ని అందించామన్నారు. క్రైమ్, లా అండ్ ఆర్డర్, పోలీసులను పది బృందాలుగా నియమించినట్లు వివరించారు.  అనంతరం గుణదల, మధురానగర్ రైల్వే స్టేషన్ లో పర్యటించారు. డీసీపీ హర్ష వర్ధన్ రాజు, మాచవరం పోలీసులు హాజరయ్యారు 

గుజరాత్ కు ప్రత్యేక బృందాలు…
చెడ్డి గ్యాంగ్ ను పట్టుకునేందుకు పోలీసులు గుజరాత్ కు ప్రత్యేక బృందాలను పంపినట్లు సిపి టి.కె. రానా తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా చెడ్డీగ్యాంగ్ దొంగల ఫోటోలను సేకరించిన పోలీసులు మరిన్ని వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే గుజరాత్ పోలీసులతో చర్చలు జరిపి.. దొంగలను పట్టుకునేందుకు సంయుక్త కార్యాచరణ అమలు చేస్తున్నారు. నగర ప్రజలు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని పోలీసు వ్యవస్థ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. డిసిపి బాబురావు, ఏడీసీపీ శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios