ఈ క్రమంలోనే రాజు హతమార్చడానికి లోవరాజుకు సంతోష్ సుపారీ ఇచ్చాడు. కాగా చాకచక్యంగా రౌడీషీటర్ నుంచి తప్పించుకొన్న రియల్టర్ పీఎస్ రాజు దువ్వాడ పోలీసులను ఆశ్రయించారు.
విశాఖపట్నంలో రియల్టర్ పీఎస్ రాజును కత్తి, డమ్మీ పిస్టల్తో బెదిరించిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. రౌడీషీటర్లు సంతోష్, లోవరాజు కలిసి రియల్టర్ను గదిలో బంధించి రూ.9.60 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో రియల్టర్ పీఎస్ రాజు కారణంగానే అరెస్ట్ అయ్యానంటూ సంతోష్ కక్షపెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే రాజు హతమార్చడానికి లోవరాజుకు సంతోష్ సుపారీ ఇచ్చాడు. కాగా చాకచక్యంగా రౌడీషీటర్ నుంచి తప్పించుకొన్న రియల్టర్ పీఎస్ రాజు దువ్వాడ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి కత్తి , డమ్మీ పిస్టల్, రూ.61 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 11, 2020, 2:56 PM IST