Asianet News TeluguAsianet News Telugu

దేవాదాయ భూముల వేలం: కోవిడ్ టైంలో ఈ పనులేంటీ.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. రాష్ట్రంలో దేవాదాయ భూముల బహిరంగ వేలం వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది

petition filed in ap high court against endowment land auction ksp
Author
Amaravathi, First Published Jun 15, 2021, 3:59 PM IST

ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. రాష్ట్రంలో దేవాదాయ భూముల బహిరంగ వేలం వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. రాష్ట్రంలో కోవిడ్, కర్ఫ్యూ ఉండగా ఎలా బహిరంగ వేలం నిర్వహిస్తారని పిటిషనర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. కోవిడ్ ఉండగా వేలం నిర్వహణ ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జులై 7వ తేదీకి వాయిదా వేసింది

Follow Us:
Download App:
  • android
  • ios