Asianet News TeluguAsianet News Telugu

తప్పిన ముప్పు: తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం,ప్రయాణీకులు సురక్షితం

తిరుమల  ఎక్స్‌ప్రెస్  రైలులో  ఇవాళ  అగ్ని ప్రమాదం  జరిగింది.  ఈ ప్రమాదం జరిగిన  బోగీలో  ప్రయాణీకులు లేకపోవడంతో  పెద్ద  ప్రమాదం  తప్పింది.

Passengers safely Escapes from Fire accident in Tirumala Express Train
Author
First Published Nov 30, 2022, 9:35 AM IST

తిరుమల: తిరుమల   ఎక్స్‌ప్రెస్‌ రైలులో  అగ్ని ప్రమాదం చోటు  చేసుకుంది.  విశాఖ నుండి  తిరుపతికి రైలు చేరుకుంది.  ఈ సమయంలో రైలులోని  ఓ  బోగీలో  అగ్ని ప్రమాదం  జరిగింది. ఈ  బోగీలో  ప్రయాణీకులు  లేకపోవడంతో  పెద్ద  ప్రమాదం  తప్పింది.   అగ్నిప్రమాదాన్ని  గుర్తించిన  రైల్వే సిబ్బంది వెంటనే రైలును నిలిపివేసి  మంటలను ఆర్పివేశారు.

గతంలో  కూడా  పలు  ప్రాంతాల్లో  రైలు బోగీల్లో  అగ్ని ప్రమాదాలు  చోటు  చేసుకున్నాయి. ఈ  ఏడాది  నవంబర్  18న నవజీవన్  ఎక్స్ ప్రెస్  రైలులో  అగ్ని ప్రమాదం  జరిగింది. నవజీవన్  ఎక్స్ ప్రెస్  పాంట్రీ బోగీలో మంటలు వ్యాపించాయి.  ఈ  మంటలను గమనించిన  రైల్వే సిబ్బంది  గూడూరులో  రైలును నిలిపివేసి  మంటలను ఆర్పివేశారు.ఈ ఘటనలో  ఎవరికి  ఎలాంటి ప్రమాదం జరగలేదు.

యాదాద్రి భువనగిరి  జిల్లాలో ఈ  ఏడాది  జూలై 3న దక్షిణ్  ఎక్స్ ప్రెస్  రైలులో అగ్ని ప్రమాదం  జరిగింది. ఘట్  కేసర్ -పగిడిపల్లి స్టేషన్ల  మధ్య ఈ ఘటన జరిగింది.  ఈ  మంటలను  గమనించిన  రైల్వే సిబ్బంది రైలును నిలిపివేసి  మంటలను ఆర్పివేశారు. దక్షిణ్  ఎక్స్ ప్రెస్ రైలులో  అగ్ని ప్రమాదానికి గల కారణాలపై  అధికారులు విచారణకు ఆదేశించారు. 

ముంబై నుండి  భువనేశ్వర్  వెళ్తున్న  కోణార్క్  ఎక్స్ ప్రెస్ లో  మంటలు వ్యాపించాయి. ఈ ఘటన ఈ  ఏడాది  జూన్  27న జరిగింది.  కోణార్క్  ఎక్స్ ప్రెస్  రైలులోని ఏసీ   బోగీలో  మంటలు వ్యాపించాయి.ఈ  విషయాన్ని గుర్తించిన రైలు సిబ్బంది  రైలును డోర్నల్  జంక్షన్  వద్ద నిలిపివేసి  మంటలను ఆర్పారు. చండీఘడ్ - కోచ్‌పల్లి  రైలులో  2019  సెప్టెంబర్  6న  అగ్ని ప్రమాదం  జరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios