ఏపీలోని విజయనగరంలో ఓ ప్యాసింజర్ రైలు అదుపుతప్పింది. లోకో మోటివ్, తొలి బోగి పట్టాలు తప్పినట్టింది.
ఆంధ్రప్రదేశ్లో ఓ భారీ ప్రమాదం తప్పింది. విజయనగరంలో ఓ రైలు పట్టాలు తప్పింది. అయితే.. లోకోమోటివ్, వెనుకాలే ఉన్న ఫస్ట్ కోచ్ పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్రయాణికులు క్షేమంగానే ఉన్నారు. ఒక్క లోకో పైలట్కు మాత్రమే గాయాలు అయ్యాయి.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Scroll to load tweet…
విశాఖపట్నం నుంచి భవానిపట్నాకు వెళ్లుతున్న ప్యాసింజర్ స్పెషల్ ట్రైన్ ఈ ప్రమాదానికి గురైంది. ట్రైన్ నెంబర్ 08504 ఒడిశాలోని కలహండి జిల్లా భవానిపట్నాకు వెళ్లుతున్నది. విజయనగరం కొత్త వలస రైల్వే స్టేషన్లో ఈ రైలు ప్రమాదానికి గురైంది. స్టేషన్లో ట్రైన్ ఆగిన తర్వాత బయల్దేరి వెళ్లుతుండగా.. ఈ ఘటన జరిగింది. ఒక్క లోకోమోటివ్, ఫస్ట్ కోచ్ మినహా మరే కోచ్ పట్టాలు తప్పలేవు.
