Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వాసుపత్రిలో చిన్నారి కిడ్నాప్: మహిళ అరెస్ట్

నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు. చిన్నారిని తల్లి ఒడికి చేర్చారు.నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో కోట మండలానికి చెందిన మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ అనారోగ్యానికి గురికావడంతో ఐసీయూలో ఉంచారు.
 

nellore police arrested woman for kidnapping child
Author
Nellore, First Published Jun 5, 2019, 5:17 PM IST


నెల్లూరు: నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు. చిన్నారిని తల్లి ఒడికి చేర్చారు.నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో కోట మండలానికి చెందిన మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ అనారోగ్యానికి గురికావడంతో ఐసీయూలో ఉంచారు.

అయితే ఈ విషయాన్ని గుర్తించిన కోవూరుకు చెందిన ఓ మహిళ ఐసీయూలోకి వెళ్లి తన బిడ్డగా చెప్పుకొని ఆ బిడ్డను తీసుకెళ్లింది. అయితే బిడ్డ కోసం వచ్చిన లక్ష్మీ కుటుంబీకులు విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయాన్ని చిన్నారి తల్లి లక్ష్మికి చెప్పకుండానే పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. 8 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.ఆసుపత్రిలోని సీసీటీవీపుటేజీ ఆధారంగా  కోవూరుకు చెందిన మహిళ చిన్నారిని కిడ్నాప్‌ చేసిందని పోలీసులు గుర్తించారు. 

ఆ మహిళ నుండి చిన్నారిని బుధవారం నాడు సాయంత్రం  కిడ్నాపర్ నుండి తీసుకొచ్చి లక్ష్మీ దంపతులకు అప్పగించారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios