రాధాకృష్ణకు కోర్టు నోటీసులు
కరువు, ప్రత్యేకహోదా విషయంలో ప్రధానమంత్రిని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసారు గుర్తుందా? ఆ విషయంపై అసత్య కథనాలు రాసారంటూ వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాధాకృష్ణ తదితరులపై కేసు వేసారులేండి.
ఏబిఎన్, ఆంధ్రజ్యోతి యాజమాని వేమూరి రాధాకృష్ణకు కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో కరువు, ప్రత్యేకహోదా విషయంలో ప్రధానమంత్రిని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసారు గుర్తుందా? ఆ విషయంపై అసత్య కథనాలు రాసారంటూ వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాధాకృష్ణ తదితరులపై కేసు వేసారులేండి. ఆ కేసు విషయమై మంగళవారం నాంపల్లి కోర్టు విచారించింది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత తగిన సమాధానం చెప్పటానికి వీలుగా కేసును వచ్చే నెల 14వ తేదీకి వాయిదా వేసింది. అయితే, పిటీషనర్ లేవనెత్తిన అంశాలపై తగిన సమాధానం చెప్పాలంటూ రాధాకృష్ణతో పాటు మరో ఏడుగురికి కూడా కోర్టు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.