Asianet News TeluguAsianet News Telugu

మదమెక్కి తల్లిని చెరబట్టబోయాడు: అపర కాళికయైన మాతృమూర్తి... కొడుక్కి ఉరి

నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడి పెంచి ప్రయోజకుడిని చేసిన తల్లిపైనే ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడబోగా.. ఆ మాతృమూర్తి అపర కాళిక అయి ఆ దుర్మార్గుడిని అంతమొందించింది

mother kills her son in guntur district
Author
Bapatla, First Published Jul 28, 2020, 7:49 PM IST

నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడి పెంచి ప్రయోజకుడిని చేసిన తల్లిపైనే ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడబోగా.. ఆ మాతృమూర్తి అపర కాళిక అయి ఆ దుర్మార్గుడిని అంతమొందించింది.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా బాపట్ల చెందిన యువకుడికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన ఆ యువకుడు.. రోజూ తాగొచ్చి హింసిస్తుండటంతో అతని భార్య తన ఇద్దరు బిడ్డలను తీసుకుని నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.

Also Read:పనీపాట లేకుండా తిరుగుతున్నాడని... కొడుకును చంపిన తల్లి

నాటి నుంచి అతను తల్లి దగ్గరే ఉంటున్నాడు. తనకు తాగేందుకు డబ్బులివ్వాలని ఆ యువకుడు ప్రతిరోజూ ఆమెను కొట్టేవాడు. అయినా ఆ మాతృమూర్తి సహించేది. ఇటీవలి కాలంలో అతని వేధింపులు మరింత ఎక్కువ కావడంతో బంధువుల ఇంటికి వెళ్లింది.

లాక్‌డౌన్ కారణంగా తన కొడుకు తిండికి ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకుని తిరిగొచ్చింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి పీకల దాకా తాగిన ఆ యువకుడు ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లిపై మద్యం మత్తులో అఘాయిత్యం చేయబోయాడు.

Also Read:ప్రియుడితో రాసలీలలు: మైనర్ కొడుకును చంపిన తల్లి

దీంతో షాక్‌కు గురైన ఆమె.. వెంటనే తేరుకుని రౌద్రమూర్తిగా మారిపోయింది. కళ్లలో కారం కొట్టి చేతికి అందిన కావిడి తాడును అతని మెడకు బిగించి చంపేసింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించింది. ఈ సందర్భంగా తాను క్షోభను పోలీసు ఉన్నతాధికారులకు వివరించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios