ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుంటూ జగన్ ప్రభుత్వం (ys jagan) కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంత్రి కొడాలి నాని (kodali nani) స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుంటూ జగన్ ప్రభుత్వం (ys jagan) కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంత్రి కొడాలి నాని (kodali nani) స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల బిల్లులో సాంకేతిక సమస్యలు ఉన్నాయని... ఈ కారణంగానే న్యాయస్థానంలో బిల్లులు నిలువలేకపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదని కొడాలి నాని స్పష్టం చేశారు. మరో 10 నిమిషాలు ఆగితే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందని ఆయన చెప్పారు. కొడాలి నాని వ్యాఖ్యలతో జనాల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. 

అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) మూడు రాజధానుల బిల్లు (Three Capital Bill) సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లును కేబినెట్ రద్దు చేసినట్టుగా అడ్వొకెట్ జనరల్ ఎస్ శ్రీరామ్ ఏపీ హైకోర్టుకు (AP High Court) తెలిపారు. ఈ క్రమంలోనే మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ‌కు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా రాయల చెరువు వద్ద మీడియాలో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి..ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం చేసిందో తనకు ఐడియా లేదన్నారు. లీగల్, టెక్నికల్ ఇష్యూ కోసమే ఇలా చేసి ఉంటున్నారని తాను అనుకుంటున్నట్టుగా చెప్పారు.

ALso read:Three capital Bill: ‘ఇంటర్వెల్ మాత్రమే.. నేను మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాను’.. మంత్రి పెద్దిరెడ్డి

చట్టం ఉపసంహరణ ఇంటర్వెట్ మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. శుభం కార్డు పడేందుకు మరింత సమయం ఉందన్నారు. సాంకేతిక సమస్యలు సరిద్దిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ అని పేర్కొన్నారు. తాను ఇప్పటికి మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదు అని వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల పాదయాత్ర లక్షల మందితో సాగుతోందా అని ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్ర అనేది పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర అని ఆరోపించారు. రైతుల పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదని ఆయన అన్నారు.