Asianet News TeluguAsianet News Telugu

సర్పవరంలో రియాక్టర్ పేలుడు: ఆరా తీసిన మంత్రి గుమ్మనూరు

తూర్పుగోదావరి జిల్లా సర్పవరంలో టైకి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టరు పేలిన ఘటనపై స్పందించారు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్. ఈ విషయంపై జిల్లా మంత్రి కన్నబాబు, జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు మంత్రి గుమ్మనూరు

minister gummanur jayaram reacts boiler blast in sarpavaram chemical factory near kakinada ksp
Author
Amaravathi, First Published Mar 11, 2021, 10:16 PM IST

తూర్పుగోదావరి జిల్లా సర్పవరంలో టైకి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టరు పేలిన ఘటనపై స్పందించారు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్. ఈ విషయంపై జిల్లా మంత్రి కన్నబాబు, జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు మంత్రి గుమ్మనూరు.

సంబంధిత అధికారులు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఇద్దరు కార్మికులు మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .

ప్రమాదంలో నలుగురు వ్యక్తులకు గాయాలు అవ్వడంతో వారికి ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించాలని గుమ్మనూరు అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై తక్షణమే విచారణ చేపట్టి, పూర్తి నివేదిక ఇవ్వాలని జయరామ్ ఆదేశించారు.

ఈ ఘటనలో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారుకులైన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

కాగా, గురువారం సర్పవరం టైకీ కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం నాడు బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు

Follow Us:
Download App:
  • android
  • ios