Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ హయాంలోనే అప్పులన్నీ...చంద్రబాబుని ప్రశ్నించండి.. బొత్స

గత ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా తమకు అనవసరమన్నారు

Minister Botsa satyanarayana Allegations on Chandrababu
Author
Hyderabad, First Published Oct 11, 2021, 3:05 PM IST

అమరావతి: గత ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో లక్షా 70 వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పుగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. 

పవన్ కల్యాణ్ గానీ.. మరొకరు ఎవరైనా గానీ చంద్రబాబును అడగాల్సి ఉందని బొత్స పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా తమకు అనవసరమన్నారు. వాళ్ల ఉద్దేశం ఏమిటంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అన్ పాపులర్ కావాలని బొత్స పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios